డిసెంబర్లో పవన్కళ్యాణ్ పాదయాత్ర, త్వరలో పార్టీ ప్లీనరీ
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే పనిలో పవన్కళ్యాణ్ ఉన్నారు. అంతేకాదు పార్టీ ప్లీనరీ నిర్వహణ తదితర అంశాలపై పవన్ పార్టీ ముఖ్యులతో ఆదివారం నాడు చర్చించారు.
జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో ఆదివారం నాడు హైద్రాబాద్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించే అంశాలు పార్టీ ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై చర్చించారు.
2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని పవన్ నిర్ణయం తీసుకొన్నారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.
అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది.జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం
పార్టీ ముఖ్యులతో జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. పార్టీ ప్లీనరీ నిర్వహించే అంశంపై చర్చించారు. త్వరలోనే పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.అయితే పార్టీ ప్లీనరీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

నవంబర్లో పాదయాత్ర
నవంబర్ చివర్లో లేదా డిసెంబర్లో పాదయాత్ర నిర్వహించాలని జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.వైసీపీ చీఫ్ జగన్ కూడ నవంబర్ రెండవ తేది నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది.

2019 ఎన్నికలకు జనసేన సన్నద్దం చేస్తోన్న పవన్
2019 ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ సన్నద్దం చేస్తున్నారు.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజల్లో తమ పార్టీ వాణిని విన్పించేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని పవన్కళ్యాణ్ బావిస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలపై కూడ అధ్యయనం చేయనున్నారు. ఈ అంశాలపై పవన్కళ్యాణ్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నారు.

రాజకీయాలకు ఇక పూర్తి సమయం
వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు గాను జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ త్వరలోనే పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్లు పూర్తి చేసిన తర్వాత రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
-
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications