స్టాలిన్ కో సలహా.. విజయ్ కో సూచన.. చెన్నై టూర్ లో పవన్ కీలక వ్యాఖ్యలు ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నైలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సెమినార్ లో పవన్ కళ్యాణ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలు దేశ ప్రగతికి చేయూతనిచ్చే సంస్కరణ అని, దేశ జీడీపీకి ఊతం ఇచ్చే విధానమని తెలిపారు. జమిలి ఎన్నికలతో దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. తమిళనాట వన్ నేషన్.. వన్ ఎలక్షన్ గురించి అబద్ధపు ప్రచారం సాగుతోందని, ఒకప్పుడు కరుణానిధి జమిలి ఎన్నికలు సూపర్ అన్నారని, అది ఇప్పుడు తప్పు ఎలా అవుతుందన్నారు.
Deeply honoured to be part of the One Nation, One Election seminar in Tamil Nadu, invited by Former Governor and State Convener Smt. @DrTamilisai4BJP Garu.
— Pawan Kalyan (@PawanKalyan) May 26, 2025
I'm truly grateful for the warm welcome and enriching discussions. My sincere thanks to @BJP4TamilNadu President Thiru… pic.twitter.com/WCHqDXkXl3
జమిలి ఎన్నికలు దేశానికి చాలా అవసరమైన మార్పు అని పవన్ తెలిపారు. దేశంలో ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా మారిపోయి దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. తరచూ ఎన్నికల నిర్వహణతో భారీగా ఖర్చుతోపాటు సమయం వృథా అవుతోందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు స్తంభించిపోతుందని, తద్వారా అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోతుందని గుర్తుచేశారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదన్నారు.

తమిళనాట ఒకే దేశం.. ఒకే ఎన్నిక గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఇండియా కూటమి పక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని పవన్ ఆరోపించారు. ఒకప్పుడు కరుణానిధి సమర్థించిన జమిలి ఎన్నికల్ని ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ అంశంపై స్టాలిన్ పునరాలోచన చేయాలన్నారు. ఒకప్పుడు దేశం మొత్తం ఒకే ఎన్నిక కావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వైసీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిందిస్తున్నాయన్నారు. అలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే నేడు జమిలిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

హీరో విజయ్ తనకు మంచి మిత్రుడని పవన్ తెలిపారు. పార్టీ అధినేతగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అన్నారు. విజయ్ ఎవరినీ అనుసరించకపోవడం మంచిదని పవన్ సూచించారు. నటుడుగా రాణించడం వేరు, నటుడు రాజకీయాల్లోకి రాణించడం వేరు అని తెలిపారు. కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం తన బాధ్యతని, గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశానని పవన్ గుర్తుచేశారు. అవసరం అనుకుంటే తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తానన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
విజయ్ వైపే యూత్, డీఎంకే కు షాక్.. తేల్చేసిన సర్వే -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications