ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు!
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కైరుప్పల గ్రామంలో ప్రతి సంవత్సరం పిడకల సమరం చాలా ఘనంగా జరుగుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిడకల సమరం భక్తులకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత రోజు ఈ పిడకల సమరాన్ని భక్తులు జరుపుకుంటారు. భద్రకాళి దేవి, వీరభద్రస్వామి పండుగ సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకుంటూ తమ భక్తిని చాటుకుంటారు.
రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం
గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటూ సమరం చేస్తారు. ఒక వర్గం స్వామివారి తరపున, మరొక వర్గం అమ్మవారి తరపున పోరాటం చేస్తారు. పోరాటంలో గాయాలైన వారు ఆ గాయాలకు స్వామివారి విభూదిని రాసుకుంటారు. మూడు రోజుల్లో ఆ గాయం నయం అవుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ సంవత్సరం కూడా పిడకల సమరం అత్యంత ఘనంగా జరిగింది.

పిడకల సమరంలో 36 మందికి స్వల్ప గాయాలు
దాదాపు అరగంట పాటు హోరాహోరీగా గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. ఈ పిడకల సమరంలో 36 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వేడుకను తిలకించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గ్రామంలో వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పిడకల సమరం తర్వాత, గ్రామ పెద్దలు పంచాయితీ చేసి వీరభద్ర స్వామికి, భద్రకాళి అమ్మవారికి కళ్యాణం ఘనంగా జరిపిస్తారు.
వీరభద్రస్వామి, భద్రకాళీ దేవి ప్రేమ కథ
అయితే అనాదిగా వస్తున్న ఈ అనవాయితీ వెనుక ఒక ఆసక్తికర ప్రేమ కథ ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులు. వీరభద్ర స్వామి పెళ్లిని ఆలస్యం చేయడంతో వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. తమ దేవతను మోసం చేశాడని భావించిన అమ్మవారి భక్తులు, వీరభద్ర స్వామిని పిడకలతో కొట్టి అవమానించాలని నిశ్చయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న వీరభద్ర స్వామి భక్తులు, ఆయనను అమ్మవారి ఆలయం వైపు వెళ్లవద్దని వేడుకున్నారు.
గ్రామ మంచి కోసం, వీరభద్ర స్వామి కరుణ కోసం పిడకల దాడి
అయినప్పటికీ, స్వామివారు ఆలయం వైపు వెళ్లగా, అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా ఆయనపై పిడకలతో దాడి చేశారు. దాంతో స్వామి వారి తరపున భక్తులు ప్రతి దాడి చేశారు. ఆపై ఇరువర్గాల వారు శాంతించి, పంచాయతీ చేసి పెళ్లి జరిపించారని ఈ పురాణం ఈ వినూత్న ఆచారం యొక్క మూలాలను వివరిస్తుంది. అప్పటినుంచి ఇప్పటివరకు గ్రామస్తులు గ్రామ మంచి కోసం వీరభద్ర స్వామి కరుణ కోసం ఈ పిడకల సమరాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
-
ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!













Click it and Unblock the Notifications