బోర్డు తిప్పేసిన రియల్ సంస్థ, ఏజెంట్ సూసైడ్ యత్నం

విశాఖ, తణుకు, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో ఈ సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన ఏజెంట్లు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.
సంస్థ తరఫున సోమరాజు అనే ఏజెంట్ సుమారు 44 లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థకు జమ చేశాడు. కొద్ది కాలంగా విశాఖపట్నం, తణుకులలో సంస్థ కార్యాలయాలు మూతపడి ఉండటంతో బాధితులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సోమరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు.
అతను ముప్పై మంది నుండి డబ్బులు వసూలు చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి నుండి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సంస్థ యజమాని శ్రీనివాస్గా తెలుస్తోంది. అతను ఏడాది క్రితం కోమలి రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించాడు.












Click it and Unblock the Notifications