ఏపీలో ఆగస్ట్ 1నుండి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు .. కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు
ఏపీలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఏపీ సర్కార్ ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నట్టు చేసిన ప్రకటనతో ఇప్పడు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం భూములు, ఫ్లాట్ల కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆఫీసుల్లో రద్దీ కనబడుతోంది.

ఏపీలో ఆగస్టు 01వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు
ఏపీ సర్కార్ రిజిస్ట్రేషన్ చార్జీలను విపరీతంగా పెంచేసింది . ఆగస్టు 01వ తేదీ నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి . 5-10 శాతం మేర ఆస్తుల విలువలు పెరగనున్నాయి. గురువారం నుంచి పెరిగిన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు గ్రామీణ ప్రాంతాలు, ఏడాదికోసారి పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలును సవరిస్తుంటారు. కామన్గా 5 శాతం మాత్రమే పెంచుతుంటారు. ఈసారి మాత్రం..కొన్ని చోట్ల 5 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 10 శాతం చొప్పున భూముల విలువలు పెరిగాయి. కాబట్టి తదనుగుణంగా చార్జీలు పెంచనున్నారు.

భూముల ధరలు పెరగటమే కారణం .. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నేపధ్యంలో కిటకిటలాడుతున్న కార్యాలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు చేసిన పెంపు ప్రతిపాదనలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఆమోదించినట్లు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు ఆగస్ట్ 1 నుండి పెరగనున్నాయి. అందుకే చాలలా మంది ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని భావిస్తున్నారు కొందరు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరిగేవి కానీ ఇప్పుడా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. భూముల, ఫ్లాట్ల రేట్లు పెరుగుతుండడమే ఇందుకు కారణమంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు అలాగే ఆర్ధిక రంగ నిపుణులు.

మధ్యతరగతి మీద పెను భారంగా రిజిస్ట్రేషన్ చార్జీలు .. తగ్గించాలని ప్రభుత్వానికి వినతి
ఉదాహరణకు రూ. 25 లక్షలున్న ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేస్తే దానిపై స్టాంప్ డ్యూటీ 5 శాతం, ట్రాన్స్ ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1 శాతం మొత్తం 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు . దీనికి GST అదనంగా చెల్లించాలి . ఈ లెక్కన చూస్తే రిజిస్ట్రేషన్కు చెల్లించాల్సిన ఫీజు లక్షా 87 వేల 500గా ఉంటుంది. ఇప్పటి పెంచిన ఛార్జీలు (5 శాతం అనుకొంటే) దీని ధర అమాంతం రూ. 26 లక్షల 25 వేలు అవుతుంది. ఇదే 10 శాతం పెరిగితే..రూ. 27 లక్షల 5 వేలు అవుతుంది. ఇది మధ్యతరగతి ప్రజలపై పెనుభారం అని పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ చార్జీలు భరించలేరని వారంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications