రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..!
పశ్చిమగోదావరి జిల్లాలోని తన నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఆకివీడు పట్టణంలో శిథిలావస్ధలో ఉన్న గొంతెనమ్మ గుడి స్ధానంలో రామాలయం నిర్మించేందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ గట్టి షాక్ తలిగింది. గొంతెనమ్మ గుడి కూల్చేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు (high court).. ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఆకివీడు గ్రామం పెద్దపేటలో శిధిలంగా ఉన్న గొంతెనమ్మ గుడిని కూల్చటానికి రఘురామ కృష్ణంరాజు బుల్డోజర్లతో బయలుదేరగా.. దీన్ని సవాల్ చేస్తూ స్థానిక వంగ జోష్ణాదేవి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న రఘురామ కృష్ణంరాజు.. ఇవాళ స్వయంగా హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదించారు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 202, 209 ప్రకారం మున్సిపల్ కమిషనర్ అనుమతి లేకుండా మతపరమైన నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్లు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ,, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రూల్ నెంబర్ 3 క్లాస్ (f) ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఏ నిర్మాణానికైనా కలెక్టర్ ఎన్వోసీ అవసరమని వాదించారు. ఏ మత సంబంధమైన నిర్మాణాలైనా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ స్థలంలో ఏ మతపరమైన నిర్మాణాలు కూడా అనుమతించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.

దీంతో ప్రభుత్వం తరఫున ఈ కేసులో హాజరైన లాయర్ శిరీష. రామాలయం నిర్మాణంలో అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని హైకోర్టుకు హామీ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే శిథిలంగా ఉన్న భవనాన్ని కూల్చడం గాని, కొత్త భవనం కట్టడం గానీ జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన చర్యలు చేపట్టరాదని తెలిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాకే రామాలయం కడతామని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ విధమైన నిర్మాణాలు చేపట్టవద్దన్న హైకోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు పంపింది.
-
నెలకు రూ. 1,47,760 వరకు జీతంతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. -
వివేకా దర్యాప్తు వ్యవహారంలో అనూహ్య పరిణామం, కీలక మలుపు..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?














Click it and Unblock the Notifications