కేంద్రంతో విభేదాలు లేవు: ప్రధాని, రైల్వే మంత్రిని కలిసిన టిఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు కె కేశవరావు తెలిపారు. బుధవారం ఆయనతోపాటు ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, తదితరులు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభులను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను ప్రధాని దృష్టికి వెళ్లినట్లు వారు తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుకోవాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల విభజనను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపిఎస్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రులకు వివరించామని వారు తెలిపారు. ఉద్యోగులు, అధికారుల విభజన పూర్తి కాకపోవడంతో పాలనా పరమైన సమస్యలు వచ్చాయన్నారు. హైకోర్టు విభజన చేయాలని ప్రధానిని కోరామని తెలిపారు.

రాష్ర్టానికి ఇస్తామన్న ఎన్టీపీసీని త్వరగా కేటాయించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రాష్ర్టానికి సంబంధించిన ప్రతి అంశం వెంటనే పరిష్కరించే దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరినట్లు ఎంపీలు తెలిపారు. అదే విధంగా కొత్త రైల్వే లైన్లపై చర్చించినట్లు తెలిపారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications