మహిళా కమిషన్ లో హైడ్రామా-చంద్రబాబు, బోండా డుమ్మా- వద్మ వర్సెస్ అనిత వాగ్వాదం
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని పరామర్శించే క్రమంలో తలెత్తిన వాగ్వాదం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే ఇవాళ విచారణకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. అదే సమయంలో మహిళా కమిషన్ కు వెళ్లిన టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితకూ, కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
చంద్రబాబు, బోండా డుమ్మా
విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఘటనపై మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన చంద్రబాబు, బోండా ఉమ డుమ్మా కొట్టారు. ముందునుంచే వారు ఈ విచారణకు హాజరు కాబోమని చెప్తూ వచ్చారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనని హెచ్చరికలు కూడా పంపింది. అయినా వారిద్దరూ పట్టించుకోలేదు. దీంతో మహిళా కమిషన్ సమన్లను వారు లెక్కచేయలేదని తేలిపోయింది.
వాసిరెడ్డి వద్మ వర్సెస్ వంగలపూడి అనిత
మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాల్సిన చంద్రబాబు, బోండా ఉమ గైర్హాజరు కాగా.. అదే సమయంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళా కార్యకర్తలు వెళ్లారు. గంటకు పైగా పోలీసులతో వాగ్వాదం తర్వాత వారిని మహిళా కమిషన్ లోకి అనుమతించారు. ఆ తర్వాత విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లితో కలిసి లోపలికి వెళ్లిన వంగలపూడి అనిత.. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలపై ఓ పుస్తకాన్ని వాసిరెడ్డి వద్మకు అందజేశారు. దీనిపై కాసేపు వాగ్వాదం తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకున్న పద్మ.. పరిశీలించి స్పందిస్తానని హామీ ఇచ్చారు.

చర్యలు తప్పవన్న వాసిరెడ్డి వద్మ
మహిళా కమిషన్ విచారణకు గైర్హాజరైన చంద్రబాబు, బోండా ఉమపై ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ మండిపడ్డారు. చంద్రబాబు, బోండా ఆస్పత్రిలో చేసిన తప్పిదాలను వరుసగా చదివి వినిపించారు. అంతేకాకుండా తమ విచారణకు హాజరు కాని వీరిద్దరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా కమిషన్ అంటే చంద్రబాబుకు గౌరవం లేదని, మహిళలంటే కూడా గౌరవం లేదని పద్మ ఆరోపించారు. పురుషాహంకారంతోనే వీరిద్దరూ తమ నోటీసుల్ని లెక్క చేయలేదన్నారు. తాము విచారణకు పిలిస్తే దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడాన్ని కూడా వాసిరెడ్డి వద్మ తప్పుబట్టారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications