బలాలు, బలహీనతలు: ఏపీతో ప్రపంచ ఆర్థిక వేదిక ఒప్పందం, ఇదే తొలిసారి
ఢిల్లీ: ఏపీ పోటీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సహకరించనుంది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్, ఏపీ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సాధారణంగా డబ్ల్యూఈఎఫ్ వివిధ దేశాలతోనే ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుంటుంది.
ఒక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజ్ ప్యాలెస్లో జరిగిన సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
Inked
MoU
with
@wef
to
help
AP
Govt
assess
our
competitiveness.
Looking
forward
to
work
with
you
@philipproesler
pic.twitter.com/hF0io8EiL5
—
N
Chandrababu
Naidu
(@ncbn)
November
4,
2015
పోటీ సామర్థ్యం అంచనాకు కుదిరిన ఒప్పందంపై సీఎం చంద్రబాబు సమక్షంలో డబ్ల్యూఈఎఫ్ నిర్వహణ మండలి సభ్యుడు, ప్రాంతీయ వ్యూహాల కేంద్రం అధిపతి ఫిలిప్ రోజ్లర్, ఏపీ ప్రత్యేక కార్యదర్శి సంజయ్గుప్తా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఆంధప్రదేశ్ ప్రభుత్వం, దాని భాగస్వాముల పోటీ సామర్థ్యానికి సంబంధించి విజ్ఞాన పంపిణీ, సాంకేతిక సహకార కార్యక్రమాన్ని డబ్ల్యూఈఎఫ్ నిర్వహిస్తుంది.
ఆంధప్రదేశ్ తన లక్ష్యాలను సాధించేందుకు అవరోధాలను గుర్తించడం, వాటి స్థాయిని నిర్ధారించడం ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. 12 అంశాల పనితీరు ఆధారంగా ఈ మదింపు ఉంటుంది.
Have
a
slew
of
meetings
lined
up
today
in
Delhi.
From
3.15-4.45
pm,
will
be
at
@wef
talk
discussing
'Growing
Cities,
Building
Resilience'.
—
N
Chandrababu
Naidu
(@ncbn)
November
4,
2015
ఈ 12 అంశాలు... సంస్థలు, మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక సుస్థిరత, ఆరోగ్యం-ప్రాథమిక విద్య, ఉన్నత విద్య-శిక్షణ, సరకు మార్కెట్ సామర్థ్యం, కార్మిక మార్కెట్ సామర్థ్యం, ఆర్థిక రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన సంసిద్ధత, మార్కెట్ పరిమాణం, వ్యాపార సరళీకరణ, నవ్య ఆలోచన పథం.
Met
Yousuf
Ali
of
Lulu
Group
in
Delhi
today.
The
Group
will
construct
a
massive
convention
centre
with
an
investment
of
Rs.1,500cr
in
Vizag.
—
N
Chandrababu
Naidu
(@ncbn)
November
4,
2015
రాజదాని నిర్మాణానికి సహకరిస్తాం: విశ్రాంత పోలీసు అధికారుల సంఘం
రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు పృథ్వీ నారాయణ బుధవారం గుంటూరు జిల్లాలో తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజలకు వారధిగా పని చేస్తామన్నారు.