వరదల వేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే టిడిపి, వైసిపి శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు.
జగన్ హయాంలోనే కృష్ణ లంక రిటైనింగ్ వాల్ నిర్మాణం అంటున్న వైసీపీ
తాజాగా వైసిపి విజయవాడలో గత వైసిపి సర్కార్ తీసుకున్న చొరవతో నిర్మించిన రిటైనింగ్ వాల్ కారణంగా 80,000 మందికి ముంపు బాధ తప్పిందని పేర్కొన్నారు. జగన్ ముందుచూపు కారణంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రజలను ముంపు నుంచి కాపాడుతుందని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.

సోషల్ మీడియాలో వైసీపీ పోస్టులు
జగన్ హయంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిందని 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ చుక్కనీరు ఇళ్లల్లోకి రాకుండా 474.51 కోట్లతో కృష్ణ నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారని వైయస్ జగన్ దార్శనికత వల్లే అనేక ప్రాంతాలు ముంపుకు గురి కాలేదని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జగన్ కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు అంటూ పోస్టులు
ఇక వైసిపి కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది.
విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan గారు.
— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు. pic.twitter.com/byqcgLC8e1
మండిపడిన టీడీపీ, రివర్స్ ఎటాక్
ఇక ఈ పోస్టులపైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించబడిందని కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు.
చంద్రబాబు గారు చేసిన పనిని, నీ కూలి మంద చేత, నీ పని అని చెప్పించుకుని తృప్తి పడుతున్నావా, ఫేక్ ఫెలో ?
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
ఇలా ఫేక్ ప్రచారం చేసే, కృష్ణలంక ప్రాంతంలో అడ్రెస్ లేకుండా పోయావ్.. తూర్పులో 50 వేలతో ఓడిపోయావ్.
చంద్రబాబు గారు పూర్తి చేసిన కృష్ణలంక రీటైనింగ్ వాల్ ఇది
Mar 23, 2019 వీడియో… https://t.co/okrO1x1GVH pic.twitter.com/QK40dbwl1g
చంద్రబాబు హయాంలోనే కృష్ణలంక రిటైనింగ్ వాల్
ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పనిని నీ కూలి మందచేత నీ పని అని చెప్పించుకుని తృప్తి పడుతున్నావా ఫేక్ ఫెలో అంటూ జగన్ ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఫేక్ ప్రచారం చేసే కృష్ణలంక ప్రాంతంలో అడ్రస్ లేకుండా పోయావంటూ టార్గెట్ చేశారు. తూర్పులో 50వేల ఓట్లతో ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ అంటూ వీడియో పెట్టి జగన్ ను టార్గెట్ చేసింది టిడిపి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications