Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాంతి స్వరూప్ మృతిపై స్పందించిన వైఎస్ జగన్, చంద్రబాబు, కేసీఆర్, లోకేష్.. ఏమన్నారంటే!!

తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఈరోజు మృతి చెందారు. రెండురోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. తెలుగుభాషలో వార్తా ప్రపంచానికి స్వాగతం పలికిన తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చక్కనైన భాషతో, స్పష్టమైన పద ఉచ్చారణతో ఈరోజుకి వార్తలు అనగానే శాంతి స్వరూప్ గుర్తొచ్చేలా అందరి మదిలో నిలిచిపోయారు.

శాంతి స్వరూప్ మృతి.. స్పందించిన జగన్
ఇక శాంతి స్వరూప్ మరణం పట్ల ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శాంతి స్వరూప్ మృతి పట్ల స్పందించారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేసిన జగన్ పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలామంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

YS Jagan Chandrababu KCR Lokesh expressed grief on Shanti Swaroop death

చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు శాంతి స్వరూప్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు దూరదర్శన్ లో వార్తలు అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఆయనే అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తామిద్దరం కలిసి ప్రతి సోమవారం ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం చేసే వారిమన్నారు.

ఆయనతో అనుబంధం సుదీర్ఘమైనదన్న చంద్రబాబు
ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందే వారని, ఆ విధంగా శాంతి స్వరూప్ తో తన అనుబంధం చాలా సుదీర్ఘమైనదని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు చంద్రబాబు.

తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు: లోకేష్
శాంతి స్వరూప్ మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన స్పందన తెలియజేశారు. దూరదర్శన్ అంటే వార్తలు.. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నట్టుగా తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

తొలితరం న్యూస్ రీడర్ గా గుర్తింపు : కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శాంతి స్వరూపం మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు టీవీలో వార్తలు చదివే తొలి తరం న్యూస్ రీడర్ గా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారని కెసిఆర్ పేర్కొన్నారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+