వైసీపీ ఫైనల్ లిస్ట్, మ్యానిఫెస్టో రెడీ-ఇడుపులపాయలో రిలీజ్-ఇచ్చాఫురం నుంచి జగన్ ప్రచారం..!
ఏపీలో వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అన్ని అస్త్రాలు సిద్దం చేసుకుంటున్న సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16న కీలక ముహుర్తం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 90 అసెంబ్లీ సీట్లతో పాటు పలు ఎంపీ సీట్లలో ఇన్ ఛార్జ్ లను మార్చేసిన జగన్.. ఇప్పుడు తుది జాబితా విడుదలకు ముహుర్తం రెడీ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వేదికగా ఈ నెల 16న వైసీపీ అభ్యర్ధుల తుది జాబితాను జగన్ రిలీజ్ చేస్తారు.
అదే రోజు ఇడుపుల పాయలో వైసీపీ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరిన్ని ప్రజాకర్షక పథకాలను అమలు చేసేందుకు వీలుగా జగన్ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణమాఫీ, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పలు అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఇడుపులపాయలోనే దీన్ని విడుదల చేస్తారు.

అదే రోజు ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి జగన్ పయనం కానున్నారు. గతంలో తాను చేసిన పాదయాత్రను ఇచ్ఛాపురంలోనే ముగించిన జగన్.. ఇప్పుడు తిరిగి అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్న జగన్.. ఆ తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకున్నారు. దీంతో నోటిఫికేషన్ రాగానే జగన్ ఎన్నికల సమరంలోకి దిగబోతున్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications