Hijab Row: హిజాబ్ వివాదం, హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు, 11 రోజుల విచారణ !
బెంగళూరు: హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశాన్ని ఎంత వరకు కుదిపేసింది అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని నాయకులతో పాటు విదేశాల్లోని ప్రముఖులు సైతం హిజాబ్ విషయంలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజ్ ల్లో చదివే విద్యార్థులు ఎవ్వరూ హిజాబ్ లు కాని, కాషాయం కండువాలు కాని దరించకూడదని హైకోర్టు హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయినా కొందరు అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని మేము స్కూల్స్, కాలేజ్ లోకి వెలుతామని పట్టుబట్టారు. అయితే హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకునే విషయంలో ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఇంతకాలం కర్ణాటక హైకోర్టులో ముస్లీం అమ్మాయిలు తరపున, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ పూర్తి అయ్యింది. విచారణ పూర్తి చేసిన హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
Recommended Video

కుదిపేసిన హిజాబ్ వివాదం
హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశాన్ని ఎంత వరకు కుదిపేసింది అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని నాయకులతో పాటు విదేశాల్లోని ప్రముఖులు సైతం హిజాబ్ విషయంలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు బీజేపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కర్ణాటక హైకోర్టు మద్యతంతర ఆదేశాలు
హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజ్ ల్లో చదివే విద్యార్థులు ఎవ్వరూ హిజాబ్ లు కాని, కాషాయం కండువాలు కాని దరించకూడదని హైకోర్టు హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయినా కొందరు అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని మేము స్కూల్స్, కాలేజ్ లోకి వెలుతామని పట్టుబట్టారు.

హిజాబ్ లేకుండా కాలేజ్ కు వెళ్లడం లేదు
కర్ణాటక హైకోర్టులో హిజాబ్ విషయంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరిగింది. ఆ సమయంలో హిజాబ్ వివాదంపై పిటిషన్లు దాఖలు చేసిన వారి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. హిజాబ్ లు వేసుకోకుండా బయటకురాలేమని, హిజాబ్ లేదని చాలా మంది కాలేజ్ కు వెళ్లడం మానేస్తున్నారని, విద్యార్థులను కాలేజ్ కు చేర్చడం లేదని కొందరు న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టులో చెప్పారు.

తీర్పు రిజర్వు
కర్ణాటక హైకోర్టులో ముస్లీం అమ్మాయిలు తరపున, ప్రభుత్వం తరపున 11 రోజుల పాటు వాదనలు వినిపించారు. 9 రిట్ లు, 40 మంద్యతర అర్జీలు దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ పూర్తి అయ్యింది. విచారణ పూర్తి చేసిన హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు ఇన్ని రోజులు హిజాబ్ విషయంలో అందరి వాదనలు విన్నారు.












Click it and Unblock the Notifications