Sridevi: వ్యాపారం చేస్తున్న భర్త, తెగ తిరిగేస్తున్న శ్రీదేవి, ముఖం చెక్కేసి, గొంతు కోసి ?, క్లైమాక్స్ లో భర్త?
బెంగళూరు/ ధారవాడ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త వ్యాపారం పనిమీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఒక్కోసారి భర్త రాత్రిపూట ఇంటికి రావడం లేదు. భర్త వ్యాపారం పని మీద బయట తిరుగుతుంటే అతని భార్య కూడా బయటకు వెళ్లి వస్తోందని సమాచారం. కొందరు బంధువులు అసలు మ్యాటర్ చెప్పడంతో భర్త అతని భార్య మీద రగిలిపోయాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు తెలిసిపోయింది. చాలాకాలం నుంచి భార్య తీరుతో విసిగిపోయిన భర్త కొడవలితో ఆమె గొంతు కోసి ముఖం పూర్తిగా చెక్కేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
Human Sacrifice: నరబలి ముందే మహిళల ప్రైవేట్ పార్ట్స్ ను కత్తితో ?, మంత్రగాడు సైకో, వాడికి?
శ్రీదేవితో సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు
కర్ణాటకలోని ధారవాడ జిల్లాలోని చిక్కమల్లిగవాడ గ్రామంలో రాజురామాపుర అలియాస్ రాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన శ్రీదేవి అనే యువతి చాలా అందంగా ఉండటంతో కొన్ని సంవత్సరాల క్రితం రాజరు ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు.
ఫుల్ హ్యాపీ అనుకున్నాడు
సినిమా హీరోయిన శ్రీదేవిలా కాకున్నా తన భార్య శ్రీదేవి అందంగా ఉందని, ఆమెతో జీవితాంతం సుఖంగా ఉండాలని భర్త రాజు అనుకున్నారు. భార్య శ్రీదేవి ఏం కావాలని అడిగినా తీసిచ్చాడు. శ్రీదేవి ఎక్కడికి వెళ్లాలని అడిగా అక్కడికి రాజు పిలుచుకుని వెళ్లాడు. శ్రీదేవి, రాజు దంపతులను చూసి వాళ్ల కుటుంబ సభ్యులు సంతోషించారు.
వ్యాపారం చేస్తున్న భర్త.... బయట తిరుగుతున్న భార్య
వ్యాపారం పనిమీద రాజు ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఒక్కోసారి రాజు రాత్రిపూట ఇంటికి రావడం లేదని తెలిసింది. భర్త రాజు వ్యాపారం పని మీద బయట తిరుగుతుంటే అతని భార్య శ్రీదేవి కూడా బయటకు వెళ్లి వస్తోందని సమాచారం. ఓ యువకుడితో శ్రీదేవి ఎక్కువ చనువుగా ఉంటున్నదని తెలిసింది.
బంధువులకు డౌట్ వచ్చింది
బాయ్ ఫ్రెండ్ బైక్ లో శ్రీదేవి తిరుగుతోందని రాజు బంధువులు గమనించారు. కొంతకాలం చూసి చూడనట్లు ఉన్న రాజు బంధువులకు అనుమానం ఎక్కువ అయ్యింది. భర్త రాజు బయటకు వెళ్లిన తరువాత శ్రీదేవి ఇంటికి తాళం వేసి ఆమె బాయ్ ఫ్రెండ్ తో సాయంత్రం వరకు తిరిగి తరువాత సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తోందని బంధువులు గమనించారు.
శ్రీదేవి మ్యాటర్ లీక్ చేసిన బంధువులు
కొందరు బంధువులు శ్రీదేవి అక్రమ సంబందం గురించి ఆమె భర్త రాజుకు అసలు మ్యాటర్ చెప్పడంతో అతను భార్య మీద రగిలిపోయాడు. భార్య శ్రీదేవికి అక్రమ సంబంధం ఉందని రాజుకు తెలిసిపోయింది. చాలాకాలం నుంచి భార్య శ్రీదేవి తీరుతో విసిగిపోయిన రాజు ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
భార్య ముఖం చెక్కేసి గొంతు కోసి చంపేసి భర్త ఆత్మహత్య
రాత్రి ఇంటికి వెళ్లిన రాజు అతని భార్య శ్రీదేవితో ఆమె అక్రమ సంబంధం విషయంలో గొడవపడ్డారు. గొడవ ఎక్కువ అయ్యింది. తరువాత వేర్వేరు గదుల్లోకి వెళ్లారు. అర్దరాత్రి రాజు కొడవలి తీసుకుని అతని భార్య శ్రీదేవి గొంతు కోసి ముఖం పూర్తిగా చెక్కేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
ప్రియుడు ఎస్కేప్
శ్రీదేవి ముఖాన్ని గుర్తు పట్టలేని విధంగా చెక్కేసిన ఆమె భర్త రాజు ఊరి బయటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ధారవాడ జిల్లా ఎస్పీ లోకేష్ జగలాస్కర్ మీడియాకు చెప్పారు. శ్రీదేవి హత్యకు గురికావడం, ఆమె భర్త రాజు ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీదేవి ప్రియుడు పరారైనాడని పోలీసులు అంటున్నారు.