Modi: రూ, వేల కోట్ల పనులకు మోదీ గ్రీన్ సిగ్నల్, డబుల్ ఇంజన్ అంటే, ఏకిపారేసిన సీఎం, మీరు చెయ్యరు, చేస్తుంటే?
బెంగళూరు/మంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని మంగళూరు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీకృష్ణుడి విగ్రహం, పరుశురాముడి విగ్రహాలు ఇచ్చి మెడలో మల్లెపూల దండవేసి స్వాగతం పలికారు. వేల కోట్లరూపాయల అభివృద్ది పనులకు ప్రధాని నరేంద్ర మోదీ పంచజెండా ఊపారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఆరోపిస్తున్న వారికి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది పనులు చేసి చూపించిందని, అందుకే డబుల్ ఇంజన్ ప్రభుత్వం అయ్యిందని, కొందరు చూసి ఓర్చుకోలేక ఏదో కారుకూతలు కూస్తున్నారని ప్రతిపక్షాల మీద మండిపడ్డారు.

ప్రధాని మోదీకి ఘనస్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మద్నాహ్నం కర్ణాటకలోని మంగళూరుకు చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గోహ్లెట్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, కేంద్ర మంత్రులు శోభాకరంద్లాజే, ప్రహ్లాద్ జోషీ, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్, పలువురు మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు.

పరుశురాముడి విగ్రహం ప్రత్యేకం
ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని మంగళూరు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీకృష్ణుడి విగ్రహం, పరుశురాముడి విగ్రహాలు ఇచ్చి మెడలో మల్లెపూల దండవేసి స్వాగతం పలికారు. ఇదే సందర్బంలో గవర్నర్, సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, బీజేపీ నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ పలకరించారు.

రూ. 3, 800 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
మంగళూరులోని గోల్డ్ ఫించ్ సిటీ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ సుమారు రూ. 3,800 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళూరులో పలు అభివృద్ది పనులు ప్రారంభం అయ్యాయి. ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక ముఖ్యమంత్రి ధన్యవాదులు తెలిపారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఇదే
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఆరోపిస్తున్న వారికి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది పనులు చేసి చూపించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

మీరు చెయ్యలేరు..... చేస్తుంటూ చూసి ఓర్చుకోలేరు
ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును చూసి ఓర్చుకోలేని కొందరు డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఆరోపిస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. దేశంలో ఎన్నడూ లేని అభివృద్ది పనులు జరుగుతున్నాయని, అందుకే మా ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అయ్యిందని, కొందరు చూసి ఓర్చుకోలేక ఏదో కారుకూతలు కూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రతిపక్ష పార్టీల మీద, ఆ పార్టీల నాయకుల మీద విరుచుకుపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications