Khiladi: అమ్మ ఏం చేస్తోందో పిన్ టూ పిన్ తండ్రికి చెబుతున్న కూతురు, గోబీ స్కెచ్ తో తల్లి !
బెంగళూరు: ఇంట్లో తల్లి ఏం చేస్తోంది, బయటకు వెళితే ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎంతసేపు వాళ్లతో గడుపుతోంది, ఇలా తల్లి గురించి కూతురు పిన్ టూ పిన్ తండ్రికి చెబుతూ వచ్చింది. నువ్వు అంటే నాకు అంత ఇష్టం లేదు, మా నాన్న అంటేనే చాలా ఇష్టం అంటూ ఆ చిన్నారని తల్లికి డైరెక్ట్ గా చెప్పడం మొదలుపెట్టింది. కూతురు తన విషయాలు మొత్తం తండ్రికి చెబుతోందని తల్లి జీర్ణించుకోలేకపోయింది. గోబీ మంచూరి స్కెచ్ వేసిన తల్లి కన్న కూతురిని పక్కాప్లాన్ తో హత్య చేసి చేతులు దులుపేసుకుంది.
Lady: ఒంటరిగా ఉందని రేప్, సెల్ఫీలు, రేప్ సీన్ వీడియో తీశాడు, ఉతికేసి పిండేసి ఆరేసి, సాక్షం !
బెంగళూరుకు వలస
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన ఈరన్న, సుధా దంపతులు పొట్టకూటికోసం బెంగళూరు చేరుకుని అన్నపూర్ణేశ్వరి నగర్ సమీపంలోని మల్లత్తహళ్ళిలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈరన్న, సుధా దంపతులకు వినూత (4) అనే కుమార్తె ఉంది. ఈరన్న కూలిపని చేస్తున్నాడు.
భార్య పార్ట్ టైమ్ ఉద్యోగం
సుధా ఇంటి సమీపంలో టైల్స్ షోరూమ్ ఉంది. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు టైల్స్ షోరూమ్ లో సుధా పని చేస్తోంది. టైల్స్ షోరూమ్ లో పని చెయ్యడానికి వెలుతున్న సమయంలో కూతురు వినూతను సుధా వెంటపెట్టుకుని వెలుతోంది. ప్రతిరోజు కూతురు వినూత వెంట వెళ్లడంతో తల్లి సుధా ఏం చేస్తోందో అనే విషయం పూర్తిగా తెలుస్తోంది.
తండ్రికి పిన్ టూ పిన్ చెబుతున్న కూతురు
సుధా ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెలుతోంది. ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఎంతసేపు ఉంటోంది. టైల్స్ షోరూమ్ లో ఎవరితో చనువుగా ఉంటోంది, ఇంటికి వచ్చిన తరువాత ఫోన్ లో ఎంతసేపు మాట్లాడుతోంది అనే పూర్తి వివరాలు పిన్ టూ పిన్ తండ్రి ఈరన్నకు అతని కూతురు వినూత చెబుతోంది.
ఎదురు తిరుగుతున్న కూతురు
నువ్వు అంటే నాకు అంత ఇష్టం లేదు, మా నాన్న అంటేనే చాలా ఇష్టం అంటూ కూతురు వినూత ఆమె తల్లి సుధాకు డైరెక్ట్ గా చెప్పడం మొదలుపెట్టింది. కూతురు వినూత తన విషయాలు మొత్తం తండ్రికి చెబుతోందని తల్లి సుధా జీర్ణించుకోలేకపోయింది. టీవీ పెట్టే విషయంలోనూ తల్లి, కూతురికి గొడవలు జరిగాయి. మానాన్న టీవీ తీసుకుని వచ్చాడు, నాకు ఇష్టం వచ్చిన చానల్ పెట్టుకుని చూస్తానని ఇటీవల వినూత ఆమె తల్లి సుధాకు తెగేసి చెప్పడంతో ఆమె కూతురి ప్రవర్తన మీద రగిలిపోయింది.
నిర్మాణంలో ఉన్న కట్టడంలో హత్య
వినూత తీరుతో రగిలిపోతున్న సుధా ఎలాగైనా కూతురిని చంపేయాలని నిర్ణయించింది. మంగళవారం మద్యాహ్నం నీకు గోబీ తీసిస్తానని నమ్మించి బయటకు పిలుచుకుని వెళ్లింది. గోబీ తీసివ్వకుండా ఎక్కడెక్కడో కూతురిని తిప్పిన సుధా చివరికి నాగరబావి రింగ్ రోడ్డులోని దీపా కాంప్లెక్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న కట్టడంలోకి పిలుచుకుని వెళ్లి పంజాబీ డ్రెస్ వేల్ తో కూతురు వినూత గొంతు బిగించి హత్య చేసింది. రాత్రి 8 గంటలకు పని ముగించుకుని ఈరన్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో వెంటనే భార్య సుధాకు ఫోన్ చేశాడు.
నిమిషంలో మాయం అయ్యింది
గోబీ తీసివ్వాలని వినూత అడిగిందని, గోబీ తినిన తరువాత తాను డబ్బులు ఇస్తున్న సమయంలో కూతురు కనపడకుండా పోయిందని సుధా భర్తకు చెప్పింది. హడలిపోయిన ఈరన్న స్నేహితులను వెంటపెట్టుకుని కూతురి కోసం చాలా ప్రాంతాల్లో గాలించాడు. భార్య సుధా గంటకు ఒకమాట చెప్పడంతో ఈరన్నకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సుధాను విచారణ చెయ్యగా గోబీ స్టోరీ బయటకు వచ్చింది.
నా కూతురిని చంపేశా
మరుసటి
రోజు
నిర్మాణంలో
ఉన్న
కట్టడంలో
బాలిక
శవాన్ని
చూసిన
స్థానికులు
పోలీసులకు
సమాచారం
ఇచ్చారు.
హత్యకు
గురైయ్యింది
వినూత
అని
ఆమె
తండ్రి
ఈరన్న
పోలీసులకు
చెప్పాడు.
పోలీసులకు
అనుమానం
వచ్చి
సుధాను
ప్రశ్నిస్తే
మళ్లీ
గోబీ
స్టోరీ
చెప్పింది.
నువ్వు
గోబీ
ఎక్కడ
తీసిచ్చావు
?
మాకు
చూపించాలి
పదా
అంటూ
పోలీసులు
సుధాను
గట్టిగా
ప్రశ్నించడంతో
అసలు
విషయం
బయటకు
వచ్చింది.
ఎందుకు చంపేశానంటే ?
నేను ఇంట్లో ఏం చేస్తున్నాను, బయట ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఎంతసేపు ఉంటున్నాను, ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడుతున్నాను అంటూ అన్ని విషయాలు తన కూతురు వినూత తన భర్తకు చెబుతోందని, ఆ విషయాలు జీర్ణించుకోలేక తన కూతురిని తానే చంపేశానని సుధా అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. కన్నకూతురు అని కనికరం లేకుండా సొంత విషయాలు తండ్రికి చెబుతున్నందుకు కూతురినే హత్య చేసిన సుధాను పోలీసులు అరెస్టు చేశారు.