Chandrayaan 3: నేను మోనార్క్ అనే డైలాగ్ సరిపోయింది, గంటకు ఒకమాట!
బెంగళూరు: చంద్రయాన్ 3 గురించి వివాదాస్పదంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. చంద్రయాన్ 3ని చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇదే సందర్బంలో ఇస్రోకు నటుడు ప్రకాష్ రాజ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు,
భారత మానవాళికి గర్వకారణమైన క్షణాలు ఇవి, ఇస్రో చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్ మరియు దీన్ని సాధ్యం చేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. విశాలమైన విశ్వంలోని మరిన్ని అద్భుతాలను జరుపుకోవడానికి ఇదే మార్గం కావచ్చు, మన భారతీయ శాస్త్రవేత్తల సత్తాచాటుకున్నారని ట్వీట్ చేశారు.

చంద్రయాన్ 3 గురించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కేవలం ఒక గంటలో 21 వేల లైక్లు మరియు 2, 700 రీట్వీట్లు వచ్చాయి. దీనికి 8 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ ట్వీట్పై పలువురు స్పందించి ప్రకాష్ రాజ్పై విమర్శలు గుప్పించారు. చాయ్వాలా, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి చరిత్ర సృష్టించారని ప్రకాష్ రాజ్పై ఘాటుగా స్పందించారు.
అంతకుముందు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పెను వివాదాన్ని సృష్టించింది. చాయ్ అమ్మేవారి చిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్ పంచుకుని చంద్రయాన్ 3 గురించి చులకనగా ట్వీట్ చేశారు. ఇదే విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ మీద కర్ణాటకలోని బాగలకోటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
చంద్రుండి తీసిన మొదటి ఫోటో అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగంగా ఓ ఫోటో పోస్టు చేశారు. ఈ ఫోటో, ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇది పాత జోక్ అని ప్రకాష్ రాజ్ మరోసారి స్పష్టం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ కూడా వివాదాన్ని లాగారు. దీనికి సంబంధించి కర్ణాటకలో కేసు కూడా నమోదు అయ్యింది.
ఆగస్టు 23న షెడ్యూల్ ప్రకారం చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా అవతరించింది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ నిలిచింది.












Click it and Unblock the Notifications