viral video: చనువిస్తే చేయేస్తావా? -కర్ణాటక బాలయ్య డీకే శివకుమార్ ఉగ్రం -రౌడీవంటూ బీజేపీ ఫైర్
అభిమానం కొద్దీ దగ్గరగా వెళ్లే అభిమానుల్ని లాగిపెట్టి కొట్టడం, సెల్ఫీలు దిగబోతే ఫోన్లను నేలకేసి కొట్టడం తెలుగునాట టీడీపీ నేత బాలయ్యకు బాగా అలవాటైన పని. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ అలాంటి శాల్తీ ఒకటుంది. పేరు డీకే శివకుమార్. కాంగ్రెస్ లోని టాప్ మోస్ట్ ట్రబుల్ షూటర్లలో ఒకరిగా పేరుపొందిన ఆయన ప్రస్తుతం కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు కార్యకర్తలపై చేయి చేసుకున్న డీకే మరోసారి ఉగ్రరూపం ప్రదర్శించారు..
వైఎస్సార్ ద్రోహి, ఆయన వారసులనూ నమ్మొద్దు -ఆంధ్రా తొత్తులకు స్థానం లేదు :షర్మిలపై హరీశ్ రావు ఫైర్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త చెంప పగలగొట్టారు. సదరు వీడియో నెట్టింట వైరల్ కావడంతో డీకేను రౌడీతో పోల్చుతూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
పార్టీ సీనియర్ నేతను పరామర్శించేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ శుక్రవారం మండ్యాలో పర్యటించారు. పరామర్శ అనంతరం నడుస్తూ బయటకు వస్తుండగా ఓ కార్యకర్త భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఆగి వెంటనే కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ''చనువు ఇస్తే చేయి వేయడానికి ప్రయత్నిస్తావా'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు బీజేపీ జనాభా బాంబు -యూపీలో ఇద్దరు పిల్లల విధానం -కాదంటే పథకాలు, ఉద్యోగాలు కట్
గతంలోనూ తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన వారి సెల్ఫోన్లను డీకే విసిరేసిన ఘటనలు ఉన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో శివకుమార్ పై బీజేపీ విమర్శలు చేసింది. సొంత పార్టీ కార్యకర్తపై నలుగురిలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కూడా డీకే ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని బీజేపీ విమర్శించింది.
#WATCH Karnataka Congress President DK Shivakumar slaps a party worker for trying to put his hand on his shoulder in Mandya yesterday pic.twitter.com/6ldIB08mdw
— ANI (@ANI) July 10, 2021