Actress: రాధా ఐ లవ్ యూ, కేసు వెనక్కి తీసుకున్న హీరోయిన్, నా కాళ్లు పట్టుకున్నాడు, పాపం !
చెన్నై: ఎస్ఐ ఉద్యోగం అడ్డం పెట్టుకుని తన రెండో భర్త తనను టార్చర్ పెడుతున్నాడని కేసు పెట్టిన వర్దమాన నటి, సుందర ట్రావెల్స్ హీరోయిన్ రాధా ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. అందరి ముందు తాను తప్పు చేశానని అంగీకరించాడని, సాటి పోలీసుల ముందు నా రెండో మొగుడు రాజ్ నా కాళ్లు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడని, అతనికి త్వరలో ప్రమోషన్ వస్తుంది, నా కారణంగా ఆయనకు ఎందుకు పదోన్నతి దూరం కావాలి, పాపం అంటూ హీరోయిన్ రాధా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెబుతోంది.
Friends: రేయ్, నేను మీ మమ్మి రాత్రి.... పచ్చి బూతులు, కోడి కోసినట్లు కోసేశాడు, లిక్కర్ ఎఫెక్ట్ !
మేడమ్ ఫస్ట్ వికెట్
తమిళ సినిమా సుందర ట్రావెల్స్ లో హీరోయిన్ గా నటించిన రాధా అలియాస్ సుంధరా ట్రావెల్స్ రాధా (38)క ఇంతకు ముందే వివాహం అయ్యి ఓ కుమారుడు ఉన్నాడు. మొదటి భర్తతో తెగతెంపులు చేసుకున్న రాధా ఆమె కొడుకు, తల్లితో కలిసి చెన్నైలోని సాలిగ్రామ్ లో వేరుగా ఉంటోంది.
ఎస్ఐతో మస్త్ మజా
చెన్నైలో
ఎస్ఐగా
ఉద్యోగం
చేస్తున్న
వసంత్
రాజ్
తో
హీరోయిన్
రాధా
లవ్
లో
పడింది.
వసంత్
రాజ్
కు
ఇంతకు
ముందే
పెళ్లి
జరిగి
భార్య,
ఇద్దరు
పిల్లలు
ఉన్నారు.
ఓ
మహిళా
న్యాయవాది
ద్వారా
ఎస్ఐ
వసంత్
రాజ్
పరిచయం
కావడంతో
రాధా
అప్పటి
నుంచి
అతనితో
కలిసి
సహజీవనం
చేసింది.
ఇటీవల
హీరోయిన్
రాధా,
వసంత్
రాజ్
కాపురంలో
చాలా
తేడాలు
వచ్చేశాయి.
మేడమ్ దెబ్బకు ఎస్ఐకి చెమటలు
నటి
రాధాకు
దూరం
కావాలని
ఎస్ఐ
వసంత్
రాజ్
వడపళని
పోలీస్
స్టేషన్
నుంచి
ఎన్నూర్
పోలీస్
స్టేషన్
కు
బదిలి
చేయించుకున్నాడు.
వసంత్
రాజ్
దూరం
కావడంతో
నటి
రాధా
తట్టుకోలేకపోయింది.
అంతే
తన
రెండో
భర్త
తనను
మోసం
చేశాడని,
చిత్రహింసలు
పెడుతున్నాడని,
పోలీసు
అధికారి
కావడంతో
తనను
బెదిరిస్తున్నాడని
ఆరోపిస్తూ
నటి
రాధా
విరుబాక్కం
పోలీస్
స్టేషన్
లో
ఎస్ఐ
వసంత్
రాజ్
మీద
కేసు
పెట్టింది.
ఎస్ఐ తక్కువ తిన్నాడా ?
తమిళనాడులో
అధికారంలో
ఉన్న
అన్నాడీఎంకే
పార్టీకి
చెందిన
ఓ
నాయకుడు,
ప్రముఖ
వ్యాపారవేత్తతో
పాటు
కొందరు
ప్రముఖులతో
నటి
రాధాకు
సన్నిహిత
సంబంధాలు
ఉన్నాయని,
కొందరితో
ఆమెకు
అక్రమ
సంబంధాలు
ఉన్నాయని,
ఈ
విషయాల
గురించి
తాను
ప్రశ్నిస్తే
తన
మీద
ఇలాంటి
తప్పుడు
కేసులు
పెడుతానని
బెదిరించిందని
ఎస్ఐ
వసంత్
రాజ్
నటి
రాధా
మీద
రివర్స్
కేసు
పెట్టాడు.
హీరోయిన్ ఏం చేసిందో తెలుసా ?
హీరోయిన్ రాధా, ఎస్ఐ వసంత్ రాజ్ వ్యవహారం రచ్చరచ్చ అయ్యింది. ఇద్దరు విచారణకు హాజరుకావాలని పోలీసు అధికారులు రాధా, వసంత్ రాజ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే ఇద్దరు పోలీసు అధికారుల ముందు విచారణకు హాజరుకాలేదు. అయితే రాధా మాత్రమే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన రెండో భర్త వసంత్ రాజ్ మీద తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని లిఖితపూర్వకంగా లేఖ రాసిచ్చి ఆమె పెట్టిన కేసును వెనక్కి తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోయింది.
మేడమ్ ఏం చెప్పిందంటే ?
కేసు వెనక్కి తీసుకున్న విషయంలో హీరోయిన్ రాధా మీడియాతో మాట్లాడారు. తన రెండో భర్త వసంత్ రాజ్ అందరి ముందు తాను తప్పు చేశానని అంగీకరించాడని, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడని అన్నారు. సాటి పోలీసుల ముందు నా రెండో మొగుడు వసంత్ రాజ్ నా కాళ్లు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడని, అందుకే మంచి మనసుతో కేసు వెనక్కి తీసుకుంటున్నానని నటి రాధా అన్నారు.
రెండో మొగుడికి రూ. లక్షలు డబ్బులు ఇచ్చాను
వసంత్ రాజ్ కొనుకున్న కారుకు తానే రూ. 4.50 లక్షలు డబ్బులు ఇచ్చానని, అప్పుడప్పుడు తన దగ్గర రూ. 20 వేలు, రూ. 30 వేలు తీసుకుంటున్నాడని, తన క్యారెక్టర్ గురించి అనుమానించి తనను కొట్టడం వలనే ఆయన మీద కేసు పెట్టవలసి వచ్చిందని, ఇక ముందు మేము సుఖంగా ఉంటామని నటి రాధా సినిమా డైలాగులు చెప్పింది.
Recommended Video
సీఐ అయిపోతాడు
త్వరలో
వసంత్
రాజ్
కు
సీఐ
ప్రమోషన్
వస్తుంది,
నా
కారణంగా
ఆయనకు
ఎందుకు
పదోన్నతి
దూరం
కావాలని,
అందరం
సుఖంగా
ఉండాలనే
తాను
కేసు
వెనక్కి
తీసుకున్నానని
నటి
రాధా
పెద్ద
పెద్ద
సినిమా
డైలాగులు
చెప్పింది.
మొత్తం
మీద
రాజ్
రాధా
రాజీ
కావడంతో
సినీ
పరిశ్రమలోని
ఆమె
సన్నిహితులు,
పోలీసు
శాఖలోని
వసంత్
రాజ్
సాటి
ఉద్యోగులు
హమ్మయ్య
అని
ఊపిరిపీల్చుకున్నారు.