నందిని Vs అమూల్, సిద్దూ సీఎంగా ఉన్న టైమ్ లోనే అమూల్ ఎంట్రీ ఇచ్చింది, ఆ రోజు?
బెంగళూరు/చెనై: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మొదలైన నందిని VS అమూల్ వివాదం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కర్ణాటకలో అమూల్ సంస్థ ఉత్పత్తులు విక్రయాలు నిర్వహించడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించలేదని, అది సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే అమూల్ సంస్థ వాటి ఉత్పత్తులు కర్ణాటకలో విక్రయించడం మొదలుపెట్టిందని అణ్ణామలై అంటున్నారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ఐపీఎస్అధికారి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పార్టీ పరిశీలకుడు అయిన అణ్ణామలై చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2017లో అమూలో తన 43వ సర్వసభ్య సమావేశంలో ఉత్తర కర్ణాటకతో పాటు దేశంలోని వివిద రాష్ట్రాల్లో ఆ సంస్థ ఉత్పత్తులు విక్రయించాలని డిసైడ్ అయ్యిందని అణ్ణామలై గుర్తు చేశారు.

అదే ఏడాది అమూల్ తన ఉత్పత్తులను కర్ణాటకలో విక్రయించడం మొదలుపెట్టిందని అణ్ణామలై అంటున్నారు. ఆ సందర్బంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు ?, సిద్దరామయ్య కాదా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ అణ్ణామలై ట్విట్ చేశారు. ఆ సందర్బంలో సీఎంగా ఉన్న సిద్దరామయ్య కర్ణాటకలో అమూల్ ఉత్పత్తులు విక్రయాలు జరగకుండా ఎందుకు అడ్డుకోలేదని అణ్ణామలై సిద్దరామయ్యను ప్రశ్నించారు.
కర్ణాటకలో సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో నందిని పాలు ప్రతిరోజు 66. 3 లక్షల లీటర్లు విక్రయించారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిరోజు నందిని పాలు 82.4 లక్షల లీటర్లు విక్రయించారని, నందినిని ఎవరు ప్రోత్సహించారు అనే విషయం ఈ లెక్కలు చూస్తే తెలుస్తాయని అణ్ణామలై అంటున్నారు.
The 43rd Annual General Body meeting of Amul held on 15.06.2017 said that Amul had expanded its fresh products footprint by launching Amul Milk in Northern Karnataka among other regions.
— K.Annamalai (@annamalai_k) April 10, 2023
Who was the CM of Karnataka back then? #SaveSiddu from ignorance. (1/3) https://t.co/H5PyGhUg6L
కర్ణాటకలో నందిని పాలు, తమిళనాడులో ఆవిన్ పాలు రెండు రాష్ట్రాలకు రెండు కళ్లులాంటివని, కావాలనే అమూల్ విషయంలో సిద్దరామయ్య అండ్ కో రాద్దాంతం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఐపీఎస్ అధికారి అణ్ణామలై మండిపడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications