Girlfriend: సహజీవనం, పెళ్లికి ప్రియురాలు నో, 15 మంది ప్రియుడు ఏం చేశాడంటే ? !
చెన్నై /మదురై: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ ఒకే ఇంటిలో సహజీవనం చేశారు. కొంతకాలం సహజీవనం చేసిన ఇద్దరి మద్య తేడాలు వచ్చాయి. నీ దారి నువ్వు చూసుకో అంటూ ప్రియురాలు ప్రియుడిని దూరం పెట్టింది. ఇంతకాలం సహజీవనం చేసిన ప్రియురాలు దూరం కావడంతో అతను తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రియురాలిని దక్కించుకోవాలని అతను అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రియుడి టార్చర్ తట్టుకోలేని యువతి పోలీసు కేసు పెట్టింది.
పోలీసులు కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ ఇచ్చినా ప్రియుడు మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు, చివరికి విసిగిపోయిన ప్రియుడు 15 మందిని వెంటపెట్టుకుని వెళ్లి ప్రియురాలిని ఆమె ఇంటిలోనే కిడ్నాప్ చేసి దర్జాగా ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఒకేసారి అంతమంది మహిళను కిడ్నాప్ చేసే సమయంలో ఆ ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.
Illegal affair: భర్తను వదిలేసి తమ్ముడి ఫ్రెండ్ తో ?, అక్క దెబ్బకు సొంత తమ్ముడు ?, క్లైమాక్స్
ప్రియురాలితో ఎంజాయ్
తమిళనాడులోని మైలాధురై ప్రాంతంలో విఘ్నేశ్వరన్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొంతకాలం క్రితం ఓ యువతి వెంటపడిన విఘ్నేశ్వరన్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కొంతకాలం విఘ్నేశ్వరన్ ఆమె వెంటపడ్డాడు. కొంతకాలం తరువాత విఘ్నేశ్వరన్, ఆ యువతి ప్రేమించుకున్నారు.క కొంతకాలం పాటు ఇద్దరూ హ్యాపీగా తిరిగారు.
ఒకే ఇంటిలో సహజీవనం
వివాహం చేసుకోకుండానే విఘ్నేశ్వరన్, ఆ యువతి ఒకే ఇంటిలో సహజీవనం చేశారు. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత బాగానే ఉన్నారు. తరువాత విఘ్నేశ్వరన్ తో అతని ప్రియురాలికి మద్య తేడాలు వచ్చాయి. నీ దారి నువ్వు చూసుకో అంటూ ప్రియురాలు ఆమె ప్రియుడు విఘ్నేశ్వరన్ ను దూరం పెట్టింది. ఇంతకాలం సహజీవనం చేసిన ప్రియురాలు దూరం కావడంతో విఘ్నేశ్వరన్ తట్టుకోలేకపోయాడు.
పోలీసులు వార్నింగ్
ప్రియురాలు ఛీకొట్టినా విఘ్నేశ్వరన్ మాత్రం ఆమె వెంటపడుతూ వేధింపులకు గురి చేశాడని తెలిసింది. ప్రియుడు విఘ్నేశ్వరన్ టార్చర్ తట్టుకోలేని యువతి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు విఘ్నేశ్వరన్, అతని ప్రియురాలు, ఇరువైపుల కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఇదే సందర్బంలో పోలీసులు ఆమె వెంటపడకూడదని ప్రియుడు విఘ్నేశ్వరన్ కు సి వార్నింగ్ ఇచ్చారు.
15 మందితో కలిసి కిడ్నాప్
పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ప్రియుడు విఘ్నేశ్వరన్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు, విసిగిపోయిన విఘ్నేశ్వరన్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రియురాలి ఇంటి మెయిన్ గేట్ నుంచి దర్జాగా 15 మందిని వెంటపెట్టుకుని వెళ్లి ప్రియురాలిని ఆమె ఇంటిలోనే కిడ్నాప్ చేసి స్కార్పియో కారులో దర్జాగా ఎత్తుకుని వెళ్లిపోయాడు.
ప్రియుడు అండ్ కో అరెస్టు
ఒకేసారి అంతమంది మహిళను కిడ్నాప్ చేసే సమయంలో ఆ ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హైవే రహదారిలో మహిళను రక్షించి విఘ్నేశ్వరన్ తో పాటు అతని అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. మహిళను కిడ్నాప్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.