Torture: ఆంటీ అదిరిందని రేప్ చేసి చంపేశాడు, 10 నెలలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, సార్ ఆ రోజు !

చెన్నై/ తిరువన్నామలై: ఇంటి నుంచి బయటకు వెళ్లిన 49 ఏళ్ల మహిళ తరువాత తిరిగిరాలేదు. ఆంటీ అదిరిపోయిందని రాత్రి ఆమెను నిర్బంధించి పదేపదే అత్యాచారం చేసిన నిందితుడు ఎక్కడ విషయం బయటకు వస్తుందో అనే భయంతో చంపేశాడు. పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకున్న వారం రోజుల పాటు విచారణ చేసినా ఎలాంటి చిన్న సాక్షం కూడా చిక్కకపోవడంతో అతన్ని వదిలేశారు. అయితే చనిపోయిన ఆంటీ అతనికి కంటిమీద కునుకులేకుండా చేసిందో ఏమో ? 10 నెలల తరువాత అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమెను నేనే చంపేశాను. హత్య చెయ్యక ముందు ఆరోజు రాత్రి నేను ఆమెను రేప్ చేశాను, నన్ను అరెస్టు చెయ్యండి మహాప్రభో అంటూ వేడుకోవడంతో పోలీసులు బిత్తరపోయారు.

 ఆంటీ భర్త చనిపోయాడు

ఆంటీ భర్త చనిపోయాడు

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వేలాంతంగల్ సమీపంలోని పెరనమల్లూర్ ప్రాంతంలో లక్ష్మీ (49) అనే మహిళ నివాసం ఉంటున్నది. అనారోగ్యంతో గత ఏడాది లక్ష్మి భర్త సెల్వరాజ్ మరణించాడు. భర్త మరణించిన తరువాత లక్ష్మీ అతని కొడుకుతో కలిసి జీవిస్తున్నది. లక్ష్మీకి సొంత పొలం ఉండటంతో కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నది. లక్ష్మీ చూడటినికి లావుగా, ఎర్రగా పొడుగ్గా ఉంటుంది.

జనవరి 5వ తేదీ రాత్రి !

జనవరి 5వ తేదీ రాత్రి !

లక్ష్మీ నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని రఘునాథసముద్రం ప్రాంతంలో ఆమెకు పొలం ఉంది. పంటను రాత్రిపూట అడవి పందులు నాశనం చేస్తుండటంతో జనవరి 5వ తేదీన లక్ష్మీ ఇద్దరు కూలీలతో కలిసి పొలం దగ్గర నైట్ పెట్రోలింగ్ చెయ్యడానికి వెళ్లింది. అర్దరాత్రి దాటిన తరువాత ఇద్దరు కూలీలు వారి ఇళ్లకు తిరిగి వెళ్లిపోవడంతో లక్ష్మీ మాత్రం పొలం దగ్గరే ఉంది.

బావిలో శవమైన లక్ష్మీ

బావిలో శవమైన లక్ష్మీ


రాత్రిపూట అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి వెళ్లిన లక్ష్మి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు ఉదయం ఆందోళన చెందిన లక్ష్మీ కొడుకు, వారి బంధువులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి వేరే వ్యక్తి పొలంలోని బావిలో లక్ష్మీ శవమై కనిపించడంతో ఆమె బంధువులు షాక్ కు గురైనారు.

రేప్ చేసి చంపేశారు

రేప్ చేసి చంపేశారు

బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పెరనమల్లూర్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. అదే సమయంలో లక్ష్మీపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపి తరువాత బావిలో విసిరేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. అదే సమయంలో లక్ష్మీ బంధువుల ఫిర్యాదు మేరకు వేలాంతంగల్ ప్రాంతానికే చెందిన నటరాజన్ (36) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంటీ మీద కన్నపడింది నిజమే.... అయితే ?

ఆంటీ మీద కన్నపడింది నిజమే.... అయితే ?

భర్త చనిపోయిన లక్ష్మీని లొంగదీసుకోవడానికి అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడని, అయితే ఆమె అతనికి లొంగలేదని లక్ష్మీ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం రోజుల పాటు పోలీసులు నటరాజన్ ను విచారణ చేశారు. అయితే లక్ష్మీని నటరాజన్ హత్య చేశాడు అని ఎలాంటి చిన్న సాక్షం కూడా చిక్కకపోవడంతో అతన్ని పోలీసులు వదిలేశారు.

10 నెలల తరువాత షాక్

10 నెలల తరువాత షాక్

రెండు రోజుల క్రితం నటరాజన్ నేరుగా రెడ్డికుప్పం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లక్ష్మీని తానే హత్య చేశానని, తనను వెంటనే అరెస్టు చెయ్యాలని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. లక్ష్మీ అత్యాచారం, హత్య కేసులో నటరాజన్ నేరం చేసినట్లు ఎలాంటి సాక్షాలు చిక్కలేదని వదిలేస్తే వీడేంది నేను హత్య చేశాను అని వచ్చి చెబుతున్నాడు అంటూ పోలీసులు బిత్దరపోయారు.

సార్.... ఆరోజు రాత్రి ఇది జరిగింది

సార్.... ఆరోజు రాత్రి ఇది జరిగింది

జనవరి 5వ తేదీ రాత్రి తాను ఫుల్ గా మద్యం సేవించి పొలం దగ్గరకు వెళ్లానని, అక్కడ లక్ష్మీ ఒంటరిగా ఉన్న విషయం గుర్తించి ఆమెపై అత్యాచారం చేశానని, పొలం దగ్గర ఆ సమయంలో కరెంట్ సరఫరా లేకపోవడంతో ఆ విషయం ఎవ్వరూ గుర్తించలేకపోయారని నటరాజన్ పోలీసులకు చెప్పాడు. లక్ష్మీ జరిగిన విషయం ఎక్కడ ఊర్లో చెబుతుందో అనే భయంతో ఆమె గొంతు నులిమి చంపేసి బావిలో విసిరేశానని నటరాజన్ పోలీసులకు చెప్పాడు. నటరాజన్ స్వయంగా నేనే లక్ష్మీని రేప్ చేసి చంపేశానని అంగీకరించడంతో పోలీసులు కూడా చేసిది ఏమీలేక అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. లక్ష్మీ ఆత్మ వెంటాడి నటరాజన్ ను చిత్రహింసలకు గురి చేసి ఉంటుందని, అందుకే అతను 10 నెలల తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడని ఆమె బంధువులు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+