మైనర్ బాలికపై తల్లి ప్రియుడు అఘాయిత్యం..ప్రైవేట్ హాస్పిటల్స్కు అక్రమంగా..!!
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట.. కామాంధుల కర్కశత్వానికి బాలికలు బలైపోతున్నారు. తాజాగా ఓమైనర్ బాలికపై ఓకామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈదారుణ ఘటన తమిళనాడులో జరిగింది.
అక్రమంగా ఆస్పత్రికి అండం రవాణా
తమిళనాడుకి చెందిన ఓమైనర్ బాలిక తన తల్లితో కలిసి ఆసుపత్రులకు అక్రమంగా అండాలను సరఫరా చేస్తోంది. ఈక్రమంలో బాలిక తల్లికి ఓవ్యక్తితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇదే అదనుగా సదరువ్యక్తి వ్యాపారం చేసే క్రమంలో అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. జరిగిన విషయం బయటికి చెప్పలేక బాలిక తనలో తానే కుమిలిపోయింది.
2017 నుంచే అక్రమ రవాణా
అక్రమ అండ రవాణాలో భాగంగా బాలిక ఓరోజు పోలీసులకు పట్టుబడింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. గత ఎనిమిదేళ్లలో ఆమె నాలుగు సార్లు పట్టుబడినట్లు గుర్తించారు. 2017 నుండి రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు బాలిక అండాలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల తర్వాత బాలికను విడిచిపెట్టారు.
బంధువుల వద్ద విలపించిన బాలిక
జైలు నుంచి విడుదల అయిన మైనర్ సేలంలో ఉండే స్నేహితులు, బంధువుల దగ్గరికి వెళ్లింది. తనకు జరిగిన నష్టాన్ని వాళ్లతో చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. పరిస్థితుల దృష్ట్యా ఇన్నాళ్లు మిన్నకుండిపోయాయని సదరు వ్యక్తికి తమకు వ్యాపారంలో భేదాభిప్రాయాలు రావడంతో విషయాన్ని బయటపెట్టినట్లు తెలిపింది. దీంతో జరిగిన దారుణంపై కుటుంబసభ్యులు ఆవ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు
ఇక రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లి , ఆమె స్నేహితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాలిక వయసు 20 ఏళ్లుగా చూపేందుకు నకిలీ ఆధార్ కార్డును సృష్టించినట్లు గుర్తించారు. ఈవిషయంలో వారిద్దరికి ఓవ్యాన్ డ్రైవర్ సహకరించినట్లు తెలిపారు.
అండం అక్రమ రవాణపై కొన్ని ఆసుపత్రులు, కొంతమంది వైద్యులను విచారిస్తున్నట్లు కేసును విచారిస్తున్న సీనియర్ అధికారి వెల్లడించారు.ఈ కేసులో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు IPC సెక్షన్లు 420, 464, 41, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అటు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్కి చెందిన అధికారుల బృందం.. మైనర్ బాలికను ఇంటర్వ్యూ చేసింది. ఒకసారి అండాలను విక్రయిస్తే 20 వేల రూపాయలు.. అందులో కమిషన్ గా 5 వేలు రూపాయలు వచ్చినట్లు బాలిక తెలిపిందని వెల్లడించారు.