ఏలూరు ‘అస్వస్థత’పై పవన్ కళ్యాణ్ స్పందన: అదే కారణమంటూ జనసేనాని ఆందోళన
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో శనివారం రాత్రి నుంచి వందలాదిమంది ప్రజలు వాంతులు, విరోచనాలు, ఆయాసం, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం, మూర్ఛపోవడం లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
Recommended Video

ఇలా ఎందుకు జరుగుతోంది..?
అయితే ఇలా ఎందుకు జరుగుతోందా? అని తెలియక అంతుచిక్కని వ్యాధిగా ప్రజలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికే 227 మందికి పైగా చేరారని అధికారిక లెక్కలు చెబుతుంటే ఇంతకంటే ఎక్కువ మందే వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు.

ఏలూరు పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది..
‘ఏలూరులో యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయం అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన ప్రతినిధులు చెబుతున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోగిని పరీక్షించిన వైద్యులు వ్యాధి ఏమిటో ప్రాథమిక అంచనాకు రాలేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది' అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యమే కారణమా?
ఏలూరులో వాయు, జల కాలుష్యాలు పరిమితికి మించి ఉన్నాయని గతంలో జరిగిన అనేక సర్వేలలో వెల్లడయింది. డ్రైనేజి పైపులు, మంచినీటి పైపులు అక్కడక్కడా కలిసిపోయినట్లు అనేకసార్లు మీడియాలో వార్తలు కుడా ప్రచురితమయ్యాయి.ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంపై ఉందన్నారు పవన్ కళ్యాణ్.

తక్షణ చర్యలు చేపట్టాలి..
‘తక్షణం వైద్య నిపుణులను ఏలూరుకి రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావలసిన అవసరం వుంది. ఆ దిశగా ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏలూరు నగరమంతా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా యంత్రాంగాన్ని మోహరించాలి. బాధితులకు అండగా వుండవలసిందిగా జనసేన నాయకులు, కార్యకర్తలను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications