health tips: మాంసాహారం బాగా తింటున్నారా? మధుమేహం వచ్చే ఛాన్స్ ఎంత ఎక్కువంటే!!
డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. మన జీవనశైలి, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, విపరీతమైన ఒత్తిడి తో కూడిన ఉద్యోగ, వ్యాపారాలు చాలామందిని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. ఇక డయాబెటిస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా మాంసాహారం తీసుకునే వారే ఉంటున్నట్టు ఇటీవల ఒక యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది.

మాంసాహారం తో డయాబెటిస్ రిస్క్ ఎక్కువ
ఎక్కువగా మాంసాహారం తీసుకునేవారు డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారని స్పెయిన్ లోని రొవిరా ఐ విర్జిల్ యూనివర్సిటీ పరిశోధన తేల్చింది. మన శరీరం పుష్టిగా ఉండాలని తీసుకుంటున్న మాంసాహారం మనకు మధుమేహాన్ని తీసుకువస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. విపరీతంగా మాంసాహారం తీసుకునేవారు మధుమేహ బాధితులు గా మారుతున్నారని అధ్యయనం రుజువు చేసింది. మాంసాహారం, శాకాహారం తీసుకునే వారిని నాలుగేళ్ల పాటు పరిశోధన జరిపిన పరిశోధన బృందం మాంసాహారం కంటే శాకాహారం తీసుకునేవారిలో మధుమేహం సమస్య తక్కువగా ఉందని, మాంసాహారం తీసుకునే వారిలో మధుమేహం సమస్య అధికంగా ఉందని గుర్తించింది.

మాంసాహారం తీసుకుంటే ఇవి మాత్రమే తీసుకోండి
డయాబెటిస్ అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. అందుకే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ తమ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవలసిన అవసరం ఉంటుంది. మాంసాహారం తింటే డయాబెటిస్ బాధితులలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక మాంసాహారం తీసుకోవాలనుకునే వారు ముఖ్యంగా రెడ్ మీట్, వేట మాంసం కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటి వాటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మాంసాహారం తిన్నా ఇలాగే తినాలి.. లేదంటే డేంజర్
మాంసాహారంలో అధికంగా ఉండే పిండి పదార్థాలు, మాంసకృత్తులు మధుమేహానికి దారితీస్తాయని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. మాంసాహారం లోని ఆర్చిడోనిక్ అనే యాసిడ్ మానవ మెదడుపై ప్రభావం చూపుతుందని తద్వారా మనుషులలో రకరకాల అనారోగ్యాలు కలిగే అవకాశం కూడా ఉంటాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల కొంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని, అందుకే ఎప్పుడూ మితం ఎప్పుడూ హితం అని చెబుతున్నారు.

మాంసాహారుల్లో కంటే శాకాహారుల్లో డయాబెటిస్ రిస్క్ చాలా తక్కువ
శరీరపుష్టికి మాంసాహారం అవసరమే కానీ అవసరానికి మించిన మాంసాహారం తీసుకోవడం వల్ల అది శరీరానికి హాని కలిగిస్తుందని, డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని అది మరింత పెంచుతుందని చెబుతున్నారు. ఇక శాకాహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి. అందుకే డయాబెటిస్ బాధితులు, డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడాలి అనుకునేవారు మాంసాహారం కాకుండా, శాకాహారం వైపు మొగ్గు చూపితే మంచిదని పరిశోధనల ఆధారంగా పలువురు సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications