గుంటూరు జీజీహెచ్ కు రూ.20కోట్ల విలువైన తన మొత్తం ఆస్తిని దానం చేసిన వైద్యురాలు!!
ఇది ఒక మహిళ కథ.. తన యావదాస్తిని గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్న ఓ మహిళా వైద్యురాలి కథ. స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ, వైద్యం పేరుతో పేద మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేస్తున్న వైద్యులు ఉన్న నేటి రోజుల్లో, వైద్యురాలిగా తాను సంపాదించిన మొత్తం ఆస్తిని గుంటూరు జిజిహెచ్ కు దానం చేసి వార్తల్లో నిలిచారు అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని.

20కోట్ల రూపాయల ఆస్తిని గుంటూరు జీజీహెచ్ కు విరాళంగా ఇచ్చిన డాక్టర్ ఉమ
డాక్టర్ ఉమా గవిని తనకు ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చేశారు. చివరకు తనకోసం ఉంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోకుండా ఆసుపత్రికి డొనేట్ చేశారు. జీజీహెచ్లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన వైద్యురాలు ఉమా అమెరికాలో ఇమ్మునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు.

బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా యావదాస్తిని దానం చేసిన ఉమ
1965 సంవత్సరం లో మెడిసిన్ పూర్తి చేసిన ఉమా, ఆ తర్వాత నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లిపోయారు. స్పెషలిస్ట్ డాక్టర్ గా అక్కడే స్థిరపడ్డారు. అయితే డల్లాస్ వేదికగా గత నెల గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికాకు చెందిన జింకానా 17వ రీ యూనియన్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఉమా తాను మెడిసిన్ చదువుకున్న గుంటూరు జీజీహెచ్ కు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకోకుండా ఉమా తన యావదాస్తిని విరాళంగా ఇచ్చారు.

భర్త మృతి.. వారసులు లేకపోవటంతో వైద్యురాలి నిర్ణయం .. ఆమె ఔదార్యంపై హర్షం
ఉమా భర్త డాక్టర్ కానూరి రామచంద్ర రావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి అమెరికాలో మత్తు వైద్యులుగా సేవలందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. ఇక ఈ దంపతులకు వారసులు కూడా లేకపోవడంతో డాక్టర్ ఉమ తన ఆస్తినంతా గుంటూరు జిజిహెచ్ కు ఇచ్చేశారు. ఎవరైనా దానం చేయదలుచుకుంటే, తమకోసం కాస్తోకూస్తో మిగిల్చుకుని దానం చేస్తారు. కానీ డాక్టర్ ఉమా మాత్రం తన యావదాస్తిని బ్యాంకు బ్యాలెన్స్ తో సహా దానం చేయడం విశేషం. తన మొత్తం ఆస్తిని దానం చేసిన డాక్టరు ఉమా ఔదార్యం పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications