SP Balu : ఎస్పీ బాలుకు అవమానం- గుంటూరులో విగ్రహం తొలగించిన కార్పోరేషన్..
దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గుంటూరులో అవమానం జరిగింది. ఎస్పీ బాలు మృతి తర్వాత ఆయన జ్ఞాపకంగా స్ధానిక కళాకారులు పెట్టిన విగ్రహాన్ని కార్పోరేషన్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా తొలగించేశారు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం పెట్టినందువల్లే తొలగించినట్లు కార్పోరేషన్ అధికారులు చెప్తున్నారు.
గుంటూరు మదర్ థెరీసా జంక్షన్ లో ఎస్పీ బాలు మరణానంతరం స్ధానిక కళాదర్బార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఇందుకోసం మున్సిపల్ అధికారుల్ని అనుమతి కోరినా రెండేళ్లుగా తిప్పడంతో చేసేది లేక కళాదర్బార్ ఈ విగ్రహం ఏర్పాటు చేసింది. దీంతో అధికారులు ఆగ్రహంతో దాన్ని తొలగించారు. ఈ వ్యవహారం స్ధానికంగా కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ఎస్పీ బాలు విగ్రహం కూడా ఇదే. దీన్ని కూడా అధికారులు నిబంధనల పేరుతో తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నామని, కానీ వారు కనికరించలేదని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు తెలిపారు. ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసుకుంటే కార్పోరేషన్ అధికారులు అక్రమమంటూ తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహాగాయకుడికి గుంటూరు కార్పోరేషన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. గుంటూరులోనే అనుమతి లేకుండా దాదాపు 200 విగ్రహాలు రోడ్లపై ఉన్నాయని, అయినా వాటికి అడ్డురాని నిబంధనలు, ఒక్క ఎస్పీ బాలు విషయంలోనే అడ్డొచ్చాయా అని కళాకారులు మండిపడుతున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications