గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనర్ బాలికపై ముగ్గురు కలిసి లైంగికదాడి, గుంటూరు జిల్లాలో ఘటన, పరారీలో నిందితులు...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

గుంటూరు జిల్లా చేబ్రోలులో ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళుతుండగా.. మైనర్ బాలిక ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కరోనా వైరస్ సందర్భంగా అన్నీ సంస్థల పనులు నిలిచిపోగా.. వ్యవసాయ పనులకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిస్థితి చూసి బుధవారం ఇంట్లోకి వచ్చిన దుండగులు.. బాలికను మభ్యపెట్టి లైంగికదాడి చేశారు. ఆ ముగ్గురు కూడా పక్కింటి వారు కావడం విశేషం. రేప్ చేస్తుండగా.. బాలిక ఆరుపులతో పక్కింటి వారు వచ్చారు. వారి రాకతో ముగ్గురు యువకులు అక్కడినుంచి పారిపోయారు. జరిగిన ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు మరునాడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Minor sexually assaulted by three men..

లైంగికదాడి చేసిన నిందితులను గుర్తించామని, త్వరలోన పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వారిపై పోక్సో, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు. నిందితుల గురించి జిల్లాలోని ఇతర పోలీసు స్టేషన్లకు సమాచారం అందజేశామని వివరించారు. ఆ ముగ్గురికి ఇదివరకు కూడా నేరచరిత్ర ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

English summary
13-year-old girl was sexually assaulted by three neighbour in andhra pradesh guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X