హైదరాబాద్కు అమిత్ షా....పార్టీలో చేరేందుకు నేతల క్యూ...
బీజేపీ చీఫ్, కేంద్రహోమంత్రి అమిత్ షా జూలై 6న హైదారాబాద్కు రానున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.హైదరాబాద్కు చేరిన అనంతరం సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు.కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షా కు పరిచయం చేస్తామన్నారు. చేరికలు నిరంతర ప్రక్రియ అని, చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఈసారి అదనంగా 40 శాతం సభ్యత్వాన్ని పెంచబోతున్నామని, 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఇప్పటికే తెలంగాణపై దృష్టి పెట్టామని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు..వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి అహ్వానిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీజేపీలో తెలంగాణ నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు..కాగా అమిత్ షా సమక్షంలో పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యతోపాటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ చేరే అవకాశాలు ఉన్నాయి.