ఓ వైపు ఎఎమ్ఐఎమ్ మరోవైపు బీజేపి మధ్యలో టిఆర్ఎస్...అసెంబ్లిలో అసక్తికర దృశ్యం..
రాజకీయంగా ఎమ్ఐఎమ్ , బిజేపి పార్టీలు బద్దశత్రువులు..ఈనేపథ్యంలో తెలంగాణలో కూడ ఇదే వైఖరితో రెండు పార్టీలు ఉన్నాయి.. తాజగా రెండు పార్టీల్లో మార్పులు వస్తున్నాయా ....అంటే అవుననే అనిపిస్తున్నాయి..అసెంబ్లిలో జరిగిన సంఘటనలు ....
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్ఐఎమ్ ,బిజేపి పార్టీలు సాధరణంగా రాజకీయ శత్రులుగా వ్యవహరిస్తారు..సిద్దాంత రిత్యా రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండడంతో ఎప్పుడు రెండు పార్టీలు ప్రజా సమస్యల పరంగా కనీసం కలిసిన పరిస్థితి ఉండదూ..ఈ మధ్య కాలంలో అయితే ప్రోటెం స్పికర్ గా ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన ముంతాజ్ ఖాన్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన నుండి ప్రమాణ స్వికారం తీసుకోవడానికి నిరాకరించాడు బిజేపి ఎమ్మెల్యే రాజా సింగ్, ఈనేపథ్యంలోనే ఆయన స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డి ద్వార అసెంబ్లిలో సభ్యుడిగా ప్రమాణ స్వికారం చేసిని పరిస్థితి....
కాని అందుకు బిన్నంగా నెల రోజుల గ్యాప్ లోనే రెండు పార్టీల మధ్య సామరస్యపూర్వక వాతవరణం ఏర్పడింది...తాజా అసెంబ్లిలో డిప్యూటి స్పికర్ గా దాదాపు ఖారారైన పద్మారావు గౌడ్ నామినేషన్ సంధర్భంలో రెండు పార్టీల మధ్య సంఖ్యత కుదిరిట్టు కనిపిస్తుంది..ఈ సంధర్భంలోనే డిప్యూటి స్పికర్ నామినేషన్ సమయంలో టిఆర్ఎస్ పార్టీ జరిపిన మంతనాలతో రెండు పార్టీల సభ్యులు చెట్టాపట్టాల్ వేసుకుని కనిపించారు..టిఆర్ఎస్ జరిపిన మంతనాలతో ఓ వైపు ...ఎఎమ్ఐఎమ్, మరోవైపు బిజేపి సభ్యులు ఉండంగా మధ్యలో టిఆర్ఎస్ సభ్యులతో కలిసి ప్రక్రియ లో పాల్గోన్నారు...
కాగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేదానికి ఈ సంఘటనే ఉదహరణగా చెప్పుకోవచ్చు..