దిశ అత్యాచారం,హత్యకేసు ... కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదా

దిశ అత్యాచారం, హత్యకేసు ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు, షాద్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా విచారణ చేపట్టాల్సి ఉందని, నిందితులను మరింత విచారణ చెయ్యాలని పిటీషన్ లో పేర్కొన్న పోలీసులు , నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ కస్టడీ పిటిషన్ ను పరిశీలించిన షాద్ నగర్ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేని కారణంగా విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు పోలీసుల కస్టడీ పిటీషన్ పై విచారణ జరగనుంది . ఇక నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. దీంతో చర్లపల్లి జైలు వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఇంకా రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇతర ఖైదీలు వారిపై దాడి చేసి చంపేస్తారేమోనన్న అనుమానంతో, నిందితులకు ప్రత్యేకంగా హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్ కేటాయించింది జిల్లా శాఖ .

Disha rape, murder case ... custody petition adjourned tomorrow

ఇక ఈ ఘటనపై ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దిశ హత్యోదంతంపై సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కదిలించినా భగ్గుమంటున్నారు. నేడు దిశ హత్యోదంతంపై పార్లమెంట్ దద్ధరిల్లింది. పార్లమెంటు ఎంపీలు ఈ దుర్ఘటనపై చర్చించారు. ఈ ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభ, రాజ్యసభలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడారు. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు ఇక రాజ్యసభలో జయాబచ్చన్ తదితరులు ఈ అంశంపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+