పీఎం కిసాన్ సన్మాన్ నిధి రావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి.. 31వ తేదీ వరకు లాస్ట్ డేట్..

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఆదర్శంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో గల రైతులకు కేంద్రం ఏటా మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2 వేల చొప్పు మూడు విడతల్లో ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.

రూ.2 వేలు జమ

రూ.2 వేలు జమ


త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ కానున్నాయి. ఈ దఫా రూ.2 వేలు రావాలంటే రైతులు e-KYC పూర్తి చేయాలి. ఇందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉంది. రైతులు e-KYC పూర్తి చేయకుంటే మీ ఖాతాల్లో డబ్బులు పడవు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా త్వరలో 11వ విడత కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమచేయనుంది.

ఈ కైవైసీ తప్పనిసరి

ఈ కైవైసీ తప్పనిసరి


ఈ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. ఈ-కేవైసీ పూర్తిచేయడానికి చివరి తేదీ మే31 వరకు మాత్రమే గడువు ఉంది. ఎవరైనా దీనిని పూర్తిచేయకుంటే భవిష్యత్తులో ఆ రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందలేరు.

రెండు విధాలు

రెండు విధాలు


రైతులు రెండు విధాలుగా పీఎం కిసాన్ ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా అప్లికేషన్‌ ద్వారా ఈ పని చేయవచ్చు. ఐతే ఇందుకోసం రైతులు తమ మొబైల్ నెంబర్‌ని ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తవుతుంది.

 వేలిముద్ర..

వేలిముద్ర..

కామన్ సర్వీస్ సెంటర్‌లో పీఎం కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ పద్ధతిలో ఈ కేవైసీ చేయవచ్చు. వేలిముద్ర పెడితే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఇక సాధారణ సేవా కేంద్రంలో కూడా ఈ-కేవేసీ చేయవచ్చు. ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ తప్పనిసరిగా ఉండాలి. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ-కేవైసీ కోసం రూ. 17 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుతోపాటు ఎస్సీసీ ఆపరేటర్లు అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తారు. కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ-కేవైసీకి రూ.37 చెల్లించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+