హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ పండుగకు కేసీఆర్ సంబరాలు సిగ్గుచేటు; కేసీఆర్ సర్కారును బొందపెట్టడం ఖాయం: ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.పెరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . టిఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం అని ఇప్పటికే పేర్కొన్న ఈటల రాజేందర్ తెలంగాణలోనే కెసిఆర్ కు దిక్కులేదని, అలాంటప్పుడు దేశ్ కి నేత ఎలా అవుతాడు అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయి

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయి

కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని పేర్కొన్నారు. విపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు తెలపడంపై ఈటల రాజేందర్ బయటకే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి అంటూ మండిపడ్డారు.

ప్రజాధనాన్ని వృధా చేస్తూ టిఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కేసీఆర్

ప్రజాధనాన్ని వృధా చేస్తూ టిఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కేసీఆర్

ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రజాధనాన్ని వృధా చేస్తూ టిఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చెల్లని కెసిఆర్ మొహం పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కెసిఆర్ దోపిడి వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్ విమర్శించారు.

తెలంగాణా బీజేపీ పండుగకు కేసీఆర్ సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటు

తెలంగాణా బీజేపీ పండుగకు కేసీఆర్ సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటు

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పండుగకు కెసిఆర్ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారును బొంద పెట్టడం ఖాయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపికి తెలంగాణ 20వ రాష్ట్రం కానుందని, వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి తీరుతామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రజల సొమ్మును తన పార్టీ సొమ్ముగా వాడుకుంటున్నారని విమర్శించారు.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
కెసీఆర్ ముఖం చూడటానికి ప్రజలు ఇష్టపడటం లేదు

కెసీఆర్ ముఖం చూడటానికి ప్రజలు ఇష్టపడటం లేదు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కెసిఆర్ ముఖం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రచార పిచ్చితో ఇతర రాష్ట్రాలలో హోర్డింగ్స్ పెట్టడం కోసం కెసిఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాధనంతో పండుగ చేసుకుంటున్న కెసిఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడతామని ఈటల రాజేందర్ తెలిపారు.

English summary
Etela Rajender slams KCR celebrations for BJP festival are a shame. Etela Rajender concluded that whenever the election comes, KCR government is sure to be defeated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X