ఇకపై బస్ స్టాండ్ లలో ఫ్రీ వైఫై .. బీఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ
ప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా , మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా , ఉద్యోగ వ్యాపారాలు చెయ్యాలన్నా అన్నిటికి ఇంటర్నెట్ అవసరమవుతుంది. ప్రజలకు ఉన్న ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన ఆర్టీసీ స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ తన ఐటీసేవలను త్వరలో ప్రారంభించనుంది .
ఇప్పటికే రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బస్టాండ్ లలో సైతం ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. దీనికోసం బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతోంది ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా 8 స్టేషన్లలో అందించాలని చూస్తోంది. తొలుత ఈసీఐఎల్, దిల్ సుఖ్ నగర్, పటాన్ చెరువు వంటి 8 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 358 బస్సు స్టాండ్ లలోనూ, హైదరాబాద్ వరంగల్ వంటి మహానగరాల్లో 1124 బస్ షెల్టర్లు ఉండగా వాటిలో ప్రయాణికుల రద్దీని ప్రామాణికంగా తీసుకొని ప్రధానమైన స్టేషన్లలో ఈ వైఫై సేవలను అందించాలని నిర్ణయించుకుంది టి ఎస్ ఆర్ టి సి. ప్రస్తుతం ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఐటీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications