GHMC Election Results 2020: 11 గంటల తర్వాతే ఫస్ట్ రిజల్ట్.. ఫలితం అక్కడే..
కాసేపట్లో గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 150 డివిజన్లకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోంది. బ్యాలెట్ పద్దతిన లెక్కించాల్సి ఉన్నందున సాయంత్రం ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు.
Recommended Video

1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
గ్రేటర్లో 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

28 వేల లోపు ఓట్లు..
సిటీలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్లోనే రానుంది.

గంట నుంచి గంటన్నర సమయం..
ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్ వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులు, ఏజెంట్లు విధిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications