గ్రేటర్ వార్ .. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఎక్కడ ? ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
జిహెచ్ఎంసి ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి పలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవన్నీ టీఆర్ఎస్ హయాంలో నెరవేరేవి కాదని టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్ళలా మారుస్తానని చెప్పారన్నారు .

హుస్సేన్ సాగర్ నీరు కొబ్బరి నీళ్లలా మారాయా.. చెప్పాలన్న ఉత్తమ్
హుస్సేన్ సాగర్ నీరు కొబ్బరి నీళ్లలా మారాయా అనేది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశాన్ని తాకేలా అందమైన భవనాలు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని గాంధీభవన్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారం ఏమైంది అంటూ ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లేవి ?
నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ కి మెట్రో రైలు తీసుకువచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలాల ఆధునికీకరణ గురించి గతంలో అనేక మార్లు చెప్పారని కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయారంటూ విమర్శలు గుప్పించారు.
సెలూన్లకు ఉచిత విద్యుత్ హామీని గతంలో ఎన్నోమార్లు చెప్పారని మళ్లీ అదే హామీ ఇప్పుడు చెప్తున్నారు అంటూ మండిపడ్డారు.

టిఆర్ఎస్ పార్టీ వైఖరితో మెట్రోకు నష్టం
ఎంఐఎం కోసం పాతబస్తీ వరకు మెట్రోని తీసుకు వెళ్లలేదని, టిఆర్ఎస్ పార్టీ వైఖరితో మెట్రోకు నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తాయిలాలు ఇవ్వటం మామూలేనని, ఆ తర్వాత మర్చిపోతారు కూడా అంటూ టిఆర్ఎస్ మేనిఫెస్టోనుద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నగర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications