భాగ్యనగరంలో దంచికొట్టిన వాన, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ఇబ్బందిపడ్డ జనం
అప్పుడే ఎండ, ఉక్కపోతతో జనం కాస్త అసహనం ఉంటే చాలు.. మబ్బు కమ్ముకొంటుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు లోతట్టుప్రాంతాలు, రహదారులపై నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో తమకు ఇక్కట్లు తప్పడం లేదని వాపోతున్నారు.
భారీ వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు సుందరయ్య పార్కు రోడ్డులో మోకాల్లోతులో వర్షపు నీరు నిలిచిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపునీరు భారీగా చేరింది. దీంతో అక్కడి జనాలు పండగపూట కూడా తమకు వరద తప్పడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవడం లేకపోవడం వల్ల తమకు అవస్థలు తప్పడం లేదని అంటున్నారు.


కాచిగూడ, అంబర్పేట, చిక్కడపల్లి, ముషీరాబాద్, నాగోల్, బండ్లగూడ, కోఠి, గోషామహల్, నాంపల్లి, బషీర్బాగ్, దిల్సుఖ్నగర్, మలక్పేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, చింతల్కుంట, సైదాబాద్, చంపాపేట్, సరూర్నగర్, బేగంపేట్, కూకట్పల్లి, జీడిమెట్ల, దుండిగల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కుషాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు ప్రధాన రహదారుల్లో నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications