పెళ్లై 20 రోజులు అయినా కాకముందే .. సనత్ నగర్ లో మహిళా టెకీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్లోని సనత్ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుని పట్టుమని నెల రోజులు కాకముందే ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పూర్ణిమ మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

20 రోజుల క్రితం ప్రేమపెళ్ళి చేసుకున్న పూర్ణిమ
ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ 20 రోజులకే చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ..సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. తమ బిడ్డను హతమార్చిన కార్తీక్ కు కఠిన శిక్షపడేలా పోలీసు చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

భర్త కార్తీక్ పనే అని తల్లిదండ్రుల ఆందోళన
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్న పూర్ణిమఅనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సనత్ నగర్లో సంచలనం సృష్టించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న పూర్ణిమ ప్రేమించిన 20 రోజుల క్రితం దాసరి కార్తీక్ను పెద్దలను ఎదిరించి మరీవివాహం చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లై నెల రోజులు పూర్తి కాకుండానే పూర్ణిమ మృతి చెందటం అందరినీ షాక్ కు గురి చేసింది. పూర్ణిమ మృతిపై ఆమె తండ్రి ప్రసాద్ ఆవేదన చెందుతున్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
పూర్ణిమను ప్రేమ పేరుతో నమ్మించి గొంతు కోశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పూర్ణిమ భర్త కార్తీక్ తన కూతురును హత్య చేశాడని ఆమె తలపై బలమైన గాయం ఉందన్నారు.పూర్ణిమ ఒంటిపై, మెడపై గాయాలున్నాయన్నారు సనత్ నగర్ పోలీసులు . ఆమె ఉరి వేసుకున్నట్లు గా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆమె తలపై కూడా గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

పోలీసుల అదుపులో కార్తీక్.. కేసు దర్యాప్తు
పూర్ణిమ భర్త కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్ణిమ మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా దొరికిందని, అది పూర్ణిమ రాసినట్లుగా ఉందని అనుమానిస్తున్నారు. ఇక పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన సనత్ నగర్ పోలీసులు, ఈ జంట వివాహం చేసుకోవడానికి ముందు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించారని చెప్పారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications