రాహుల్ను చూసి కేసీఆర్ సర్కార్ వణుకుతుంది.. అందుకే ఓయూలో పర్మిషన్ ఇవ్వలే: రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ సభ కోసం బిజీగా ఉన్నారు. అయితే 7వ తేదీ ఓయూ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటనకు వస్తుంటే కేసీఆర్ హడలిపోతున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ ఓ పిరికి పాలకుడు అని, మరో పన్నెండు నెలల్లో ఆయన పాలన ముగియనుందని అన్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. అయితే వారిని అరెస్ట్ చేయడంతో.. కలిసేందుకు జగ్గారెడ్డి వెళితే ఆయనను కూడా అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.
రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. వర్సిటీలో ఏ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకూడదని డిషిసన్ తీసుకుంది. క్యాంపస్లో కెమెరాలను కూడా నిషేధించింది. 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.

రాహుల్ గాంధీ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఆగ్రహాం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థిసంఘాల నేతలు ప్రయత్నించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో వరంగల్కు వెళతారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేస్తారు. రాహుల్గాంధీ, ఇతర నేతలకు ఒకటి.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక నిర్మిస్తారు. సభ తర్వాత వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళతారు. అదు రోజు రాత్రి హైటెక్ సిటిలోని దుర్గం చెరువు పక్కనున్న కోహినూర్ హోటల్లో రాహుల్ గాంధీ బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం హోటల్ కోహినూర్లో టీపీసీసీ ముఖ్య నాయకులతో అల్పాహార సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్ వెళతారు. సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. అటు నుంచి గాంధీ భవన్ వెళతారు. తెలంగాణ అమరవీరుల తో రాహుల్ గాంధీ లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications