థర్డ్ వేవ్ ముప్పు లేదు.. జ్వరాలు మాత్రం ఉన్నాయి: డీహెచ్ శ్రీనివాస రావు
కరోనా కలవరానికి గురిచేస్తోంది. థర్డ్ వేవ్ అని ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఖండించారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్పై ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ప్రారంభించాయన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే 104 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్త వేరియంట్ వస్తే తప్పితే మన దగ్గర థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని వివరించారు. అలాగని ముప్పు తొలిగిపోలేదని స్పష్టంచేశారు. వ్యాక్సిన్, మాస్క్ తప్పనిసరి గా పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.

613 డెంగ్యూ కేసులు
రాష్ట్రంలో 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. హైదరాబాద్ లో అత్యధికంగా వచ్చాని చెప్పారు. మలేరియా కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కొత్తగూడెం, ములుగులో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయన్నారు. 2019లో డెంగ్యూ కేసులు 4 వేలు రిపోర్ట్ అవగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 వరకు 3 వేల కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు.

రెడీ
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని డీహెచ్ తెలిపారు. ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతే జనాలను ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తున్నారని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అక్టోబర్ నెలాఖరు వరకు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 0.4% మాత్రమే పాజిటివిటీ రేట్ ఉంటుందన్నారు.

నియంత్రణలోనే..
తెలంగాణలో కొవిడ్ నియంత్రణలో ఉందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. విద్యాసంస్థలు రీ ఓపెన్ అయ్యాయి కాబట్టి కేసులు ఎక్కువగా నమోదవుతాయిని అనుకున్నాము.. కానీ క్లస్టర్ బ్రేక్ ఎక్కడా చోటు చేసుకోలేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్కి పంపొచ్చన్నారు. సెప్టెంబర్లో పీక్ లోకి వెళ్తుంది, కేసులు విపరీతంగా పెరుగుతాయని.. కానీ మన రాష్ట్రంలో అదుపులో ఉందని తెలిపారు. 27 వేలకు పైగా ప్రభుత్వ బెడ్స్ మొత్తం ఆక్సిజన్ బెడ్స్ గా మార్చామన్నారు. భవిష్యత్లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Recommended Video

40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు సిద్దం
40 శాతం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ తో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్నారులకు ట్రీట్మెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 3వేల 600 కు పైగా బెడ్స్ చిన్నారుల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు. మాస్క్ ధరించడం మానొద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో IT కంపెనీలు ప్రారంభించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ కోరుతోందన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ చెయ్యాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ 2కోట్లకు చేరువలో ఉన్నామన్నారు. వ్యాక్సిన్ వల్ల మరణాల నుంచి తప్పించవచ్చన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications