పీజేఆర్ ఆనాడే గొంతెత్తారు.. విష్ణుతో రేవంత్ రెడ్డి భేటీ, అండగా ఉంటానని భరోసా
రేవంత్ రెడ్డి నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఇతర నేతలను వరసగా కలుస్తూ వస్తున్నారు. ఇదివరకు అంతగా ప్రాధాన్యం లభించని/ పక్కనబెట్టిన నేతలను మీట్ అవుతున్నారు. వారికి తాను ఉన్నానని భరోసాను ఇస్తున్నారు. కలిసి పనిచేద్దాం అని.. పార్టీని నిలబెడదాం అని చెబుతూ వస్తున్నారు. రోజుకో నేత చొప్పున రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ఇవాళ పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు.

పోతిరెడ్డిపాడు మరణశాసనమే..
పీజేఆర్ను రేవంత్ రెడ్డి కొనియాడారు. పార్టీకి, తెలంగాణ కోసం పీజేఆర్ ఆనాడే గొంతు ఎత్తారని చెప్పారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రజల పట్ల మరణశాసనంగా మారుతుందని ఆనాడే పీజేఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ గొప్ప నాయకుడు అని ప్రశంసలతో ముంచెత్తారు. విష్ణువర్ధన్ రెడ్డి తనకు సోదర సమానుడు అని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని పీజేఆర్ కొట్లాడడంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోలేదని అన్నారు.

ఆశయాలతో ముందుకెళ్తాం..
పీజేఆర్ ఆశయాలను తాము ముందుకు తీసుకువెళతామని రేవంత్ రెడ్డి స్పస్టంచేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి భరోసాను ఇచ్చారు. దీంతో విష్ణు శిబిరంలో మరింత ఆత్మవిశ్వాసం నింపినట్టు అయ్యింది. ఇదివరకు పట్టించుకోలేదని.. ఇప్పుడు టీ పీసీసీ ఛీప్ స్వయంగా ఇంటికి రావడంతో ధైర్యం ఇచ్చినట్టు అయ్యింది.

శ్రావణ్తో భేటీ
మరోవైపు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్తో రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు. ఆయన కార్యాలయానికి వెళ్లి మరీ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు డిస్కష్ చేశారు. ఇప్పటికే జానారెడ్డి, షబ్బీర్ అలీని రేవంత్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. తన, పర అనే భేదం లేకుండా ప్రతీ ఒక్కరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
అందరినీ కలుపుకొని ముందుకుసాగేలా ప్రణాళిక రచించారు. 7వ తేదీన పీసీసీ చీఫ్ పదవీ చేపడతారు. ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారని తెలిసింది. ఇప్పటికే బండి సంజయ్ తన పాదయాత్ర తేదీని కూడా ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రకటించడమే తరువాయిగా మిగిలింది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications