హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

31 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తారా..? సారాలమ్మ జాతరపై ప్రశ్న: హైకోర్టు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ అరికట్టేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంక్షలపై పూర్తి వివరాలతో ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ను హైకోర్టు గతవారం ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ న్యాయవాది ఆధ్వర్యంలో హైకోర్టుకు వివరాలను వివరించారు.

 స్కూల్స్ స్టార్ట్..

స్కూల్స్ స్టార్ట్..

పలు విషయాలను ధర్మాసనం అడిగి తెలుసుకుంది. జనవరి 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వైద్య కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవనే పిటిషన్ తరుపు న్యాయవాదుల ప్రశ్నకు.. డీహెచ్ శ్రీనివాస్ బదులిచ్చారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు.. ఆంక్షలు విధించాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

77 లక్షల ఇళ్ల జ్వర సర్వే

77 లక్షల ఇళ్ల జ్వర సర్వే

రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసి లక్షణాలు ఉన్న బాధితులకు 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని డీహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కరోనా సమయంలో సమ్మక్క జాతర ఏర్పాట్లు, వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలు, పాఠశాలల ప్రారంభంపై మూడు రోజుల్లోగా పూర్తి నివేదికతో రావాలని హెల్త్ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

నిర్ణయం తీసుకోలే..

నిర్ణయం తీసుకోలే..

ఇటు రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు నిలకడగా ఉండడం సానుకూల అంశంగా మారింది. విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెలవులు.. కానీ 3 రోజులు అదనంగా ఉన్నారు. 16వ తేదీ వరకు పండుగ సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతోపాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

Recommended Video

Hyderabad నగరానికి Fever .! సిటీ మొత్తం ఖాళీ ! | Oneindia Telugu
పొడగింపు.. స్కూల్స్ స్టార్ట్..?

పొడగింపు.. స్కూల్స్ స్టార్ట్..?

30వ తేదీతో ముగియనున్న సెలవులను పొడిగిస్తారా? లేక విద్యా సంస్థలను ప్రారంభిస్తారా? అన్న అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పాఠశాలలను తెరవాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రెండేళ్ల నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడిందని అంటున్నాయి. వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం, ప్రస్తుత కరోనా వేరియంట్‌ అంత ప్రమాదకారి కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నాయి.

English summary
schools are open 31st january in telangana state highcourt asked to government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X