తెలంగాణాలో మరో అవినీతి చేప .. క్రికెట్ బెట్టింగ్ లంచం వ్యవహారంలో కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ
తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన అధికారికి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో గుర్తించారు . దీంతో ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారి, కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ ,నల్గొండ ,కామారెడ్డి జిల్లాల్లో ఆయనకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు.

కామారెడ్డి డీఎస్పీని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు .. 2.12 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్ , నల్గొండ, కామారెడ్డి జిల్లాలలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కామారెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ (డిఎస్పి) టి లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. 2.12 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను హైదరాబాద్ నివాసం నుంచి ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నివాసం నుంచి అధిక సంఖ్యలో బుల్లెట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కామారెడ్డి ఇన్స్పెక్టర్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది .

క్రికెట్ బెట్టింగ్ నిందితులకు బెయిల్ ఇవ్వటానికి లంచం డిమాండ్ కేసు
క్రికెట్ బెట్టింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి కామారెడ్డి ఇన్స్పెక్టర్ జగదీష్ నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిందితులను బెయిల్పై విడుదల చేసినందుకు రూ .1.39 లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్స్పెక్టర్ జగదీష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో జగదీష్ ఇంట్లో తనిఖీలు చేయగా 34 లక్షల రూపాయల నగదును, బంగారాన్ని వెండిని ఏసీబీ అధికారులు గుర్తించారు.

తీగ లాగితే కదులుతున్న డొంక.. డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు
ఈ కేసుతో సంబంధమున్న కామారెడ్డి సిఐ, ఎస్ఐ, మధ్యవర్తి లను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారించగా అందులో కొంత నగదు కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణకి చెందినదని సిఐ పేర్కొన్నారు . ఇంకా ఈ కేసులో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన డిఎస్పి లక్ష్మీనారాయణ నివాసంలో అధికారులు సోదాలు జరిపారు .

ఆయా జిల్లాలలో కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఆయా జిల్లాలలో 17 చోట్ల వ్యవసాయ భూములు, 5 ఖాళీ ఇళ్ల స్థలాలు, మిర్యాలగూడ , తిరుమలగిరి ,సరూర్నగర్, వంటి ప్రాంతాలలో భవనాలతోటు బంగారము, నగదు ఉన్నట్లుగా ఎసిబి అధికారులు గుర్తించారు. వాటి విలువ 2.12 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అంతే కాదు ఆయన వద్ద అదనంగా గుర్తించిన బుల్లెట్లు, గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications