కిలాడీ లేడీ : ప్రేమించి మోసపోయింది.. ఓఎల్ఎక్స్ వేధికగా మోసాలు చేసి బ్రతికేస్తోంది...!
హైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి హైదరాబాద్ కు చేరిన యువతి మోసపోయింది. ప్రేమికుడి నయవంచనతో అటు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేక, జీవన పోరాటానికి మోసాల బాట ఎంచుకుంది. దొంగలా మారి చివరకు పోలీసులకు చిక్కింది.

ప్రేమికుడి మోసం.. దొంగలా మారిన వైనం
గుంటూరుకు చెందిన 24 ఏళ్ల అరవింద, ప్రేమికుడి మాయమాటలతో హైదరాబాద్ చేరుకుంది. కొన్నిరోజులు గడిచాక ముఖం చాటేశాడు సదరు మోసగాడు. కన్నవారికి తన ముఖం చూపించలేక నగరంలోనే ఉంటూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేసింది. ఆ సంస్థలో పరిచయమైన ఓ మహిళ ద్వారా ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టే ఫోన్లను ఎలా కొట్టెయ్యచ్చో తెలుసుకుంది.

ఖరీదైన ఫోన్లకు ఎసరు
అలా మార్చి నెల నుంచి మోసాలకు శ్రీకారం చుట్టింది అరవింద. ఓఎల్ఎక్స్లో పెట్టే ఖరీదైన ఫోన్లు కొట్టానంటూ సదరు యజమానులకు ఫోన్ చేసేది. వారిని ఫలానా అడ్రస్ కు రావాలంటూ లొకేషన్ షేర్ చేసేది. తీరా వారు వచ్చాక ఛార్జింగ్ చెక్ చేస్తానంటూ లోనికి వెళ్లి మాయమయ్యేది. ఆమె కోసం ఆ ఇంటి గేటు దగ్గరే నిరీక్షించేవారు. కాసేపయ్యాక ఆమె కోసం ఆరా తీస్తే అలాంటివారు అక్కడ ఎవరూ లేరనే సమాధానం వచ్చేది.

ఈ ఇల్లు మాదే.. ఇక్కడే ఉండండి..!
ఫోన్ల కోసం ఎవరికైతే కాల్ చేసేదో, వారు రావడానికంటే ముందే పెద్ద స్కెచ్ వేసేది అరవింద. ఎవరూ లేని ఓ ఇంటిని సెలెక్ట్ చేసుకునేది. అది కూడా బ్యాక్ డోర్ నుంచి సులువుగా తప్పించుకునే వీలుండే ఇళ్లనే ఏరికోరి సెలెక్ట్ చేసుకునేది. అంతా ఓకే అనుకున్నాక.. సదరు ఫోన్ల యజమానులకు లొకేషన్ షేర్ చేసేది.
తీరా వారు వచ్చాక ఛార్జింగ్ చెక్ చేస్తా, లోనికి వెళ్లి డబ్బులు తెస్తానంటూ వెనుక డోర్ నుంచి తప్పించుకునేది. వచ్చినవారు ఆమె కోసం చూసి చూసి ఇరుగు పొరుగన ఎంక్వైరీ చేస్తే అలాంటివారు ఇక్కడ ఎవరూ ఉండరనే సమాధానం వచ్చేది. దాంతో తాము మోసపోయామని గుర్తించేవారు.

ఎక్కడైతే దొంగిలింపబడ్డాయో.. అక్కడే అమ్మకం
ఒక్కోసారి ఒక్కో ఇల్లును సెలెక్ట్ చేసుకునే కిలేడీ అరవింద పలు జాగ్రత్తలు తీసుకునేది. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేది. అలా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలువైన మూడు ఫోన్లను చాకచక్యంగా కొట్టేసింది. దాదాపు 2 లక్షల 20 వేలు ఖరీదు చేసే ఫోన్లను తస్కరించింది. సైదాబాద్ పీఎస్ పరిధిలో ఇలాంటి చోరీకి పాల్పడింది.
అలా దొంగిలించిన ఖరీదైన ఫోన్లను తిరిగి ఓఎల్ఎక్స్లోనే అమ్మకానికి పెడుతోంది అరవింద. వాటి ద్వారా వచ్చిన క్యాష్ తో జల్సాలు చేస్తోంది. అయితే చోరీ చేసిన ప్రతిసారి సిమ్కార్డులు మార్చేస్తోంది. మొత్తానికి తెలివిగా తప్పించుకుంటున్నానని భావించిన అరవింద చివరకు పోలీసుల చేతికి చిక్కింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications