Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2021లో కరోనావిలయంలో 2.4లక్షల మంది మృతి; త్వరలో మళ్ళీ అదే సీన్ రిపీట్: యూఎన్ షాకింగ్ నివేదిక

కోవిడ్-19 డెల్టా వేరియంట్ యొక్క ఘోరమైన సెకండ్ వేవ్ 2021 ఏప్రిల్ మరియు జూన్ మధ్య భారతదేశంలో 2,40,000 మంది ప్రాణాలను తీసిందని మరియు ఆర్థిక పునరుద్ధరణకు అంతరాయం కలిగించిందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. సమీప కాలంలో ఇటువంటి ఎపిసోడ్ లు పునరావృతం కావచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. కరోనా మహమ్మారి ప్రభావం ముందు ముందు భయంకరంగా ఉండబోతుందని పేర్కొంది.

2021లో కరోనా సెకండ్ వేవ్ సీన్ రిపీట్ కావచ్చు.. యూఎన్ నివేదిక

2021లో కరోనా సెకండ్ వేవ్ సీన్ రిపీట్ కావచ్చు.. యూఎన్ నివేదిక

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎకనామిక్ సిట్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ (WESP) 2022 నివేదిక కూడా కోవిడ్ -19 యొక్క అత్యంత వ్యాప్తి చెందగల ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి యొక్క కొత్త వేవ్ లకు కారణం కావడంతో మహమ్మారి కారణంగా మళ్లీ ఉపద్రవం చోటు చేసుకోవచ్చని, 2021 ఏప్రిల్ జూన్ మధ్య ఎదురైన పరిస్థితి మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఎదురుకావచ్చు అని అంచనావేసింది. ఈసారి కరోనా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్ లో దారుణ పరిస్థితులు ఎదురు కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్ మరియు జూన్ మధ్య 2,40,000 మంది బలి

ఏప్రిల్ మరియు జూన్ మధ్య 2,40,000 మంది బలి

భారతదేశంలో, డెల్టా వేరియంట్‌తో సంభవించిన ఘోరమైన కరోనా ఉప్పెన వల్ల ఏప్రిల్ మరియు జూన్ మధ్య 2,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేసింది. ఆసుపత్రులలో బెడ్లు దొరకక ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ఆక్సిజన్ కోసం అలమటించారు. కరోనా మహమ్మారి ఆర్థిక పునరుద్ధరణకు అంతరాయం కలిగించింది. 2021లో సంభవించిన కరోనా సెకండ్ వేవ్ దారుణ పరిస్థితులను దేశంలో సృష్టించింది. ఇలాంటి ఎపిసోడ్‌లు సమీప కాలంలో జరుగుతాయని నివేదిక పేర్కొంది.

వ్యాక్సినేషన్ లో అసమానతలే కారణం

వ్యాక్సినేషన్ లో అసమానతలే కారణం

వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగటంలో అసమానతల కారణంగా కరోనా మహమ్మారి సమాజానికి పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుందని, సార్వత్రిక వ్యాక్సిన్స్ ప్రాప్తి లేకపోవడం వల్ల, వ్యాక్సినేషన్ పై ప్రపంచ విధానం సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని, ఈ విపత్తుకు ప్రధానమైన కారణం ఇదే అని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ-జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ లియు జెన్‌మిన్ అన్నారు.

డెల్టాను మించి ఆధిపత్య వేరియంట్ గా ఒమిక్రాన్ వేరియంట్

డెల్టాను మించి ఆధిపత్య వేరియంట్ గా ఒమిక్రాన్ వేరియంట్

భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు దేశంలో 1,54,61,39,465 టీకాలు వేయబడ్డాయి. కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండవ తరంగం భారతదేశం అంతటా వినాశనం కలిగించింది. మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై భారం పడుతోంది. దేశం ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ యొక్క పెరుగుతున్న కేసులను చూస్తోంది. ఇది త్వరలో ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్‌ను అధిగమించి కేసులను నమోదు చేస్తుంది.

 కరోనా దెబ్బకు ప్రతికూలతలు ఎదుర్కోనున్న దక్షిణాసియా.. యూఎన్ నివేదిక

కరోనా దెబ్బకు ప్రతికూలతలు ఎదుర్కోనున్న దక్షిణాసియా.. యూఎన్ నివేదిక

2030 ఎజెండాను సాధించడంలో ప్రధానమైన ప్రతికూలతలను దక్షిణాసియా ఎదుర్కొంటుందని నివేదిక పేర్కొంది. నెమ్మదిగా సాగుతున్న వ్యాక్సినేషన్ పురోగతి ఈ ప్రాంతాన్ని కొత్త వైవిధ్యాలు, పునరావృత వ్యాప్తికి గురి చేస్తుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక అవరోధాలు, సరిపోని ప్రపంచ వ్యాక్సిన్ సరఫరా ఇబ్బందులకు కారణంగా మారింది. డిసెంబరు 2021 ప్రారంభంలో, బంగ్లాదేశ్, నేపాల్ మరియు పాకిస్తాన్ వారి జనాభాలో 26 శాతం కంటే తక్కువ మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ నిర్వహించింది. భూటాన్, మాల్దీవులు మరియు శ్రీలంకలో పూర్తిగా టీకాలు వేసిన జనాభా 64 శాతానికి పైగా ఉందని నివేదిక పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+