వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Road Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ నల్లా వద్ద మినీబస్సు డ్రైవర్ అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

"ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. 26 మంది గాయపడ్డారు. ఆర్మీ రెస్క్యూ బృందాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గాయపడిన వారిని పూంచ్ జిల్లాలోని మండి పట్టణంలోని ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు" అని వర్గాలు తెలిపాయి.

A Big Road Accident in Jammu and Kashmir

ఈ ఘటనపై జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూంచ్ లోని సావ్జియాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు అందజేస్తామని తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని పోలీసు, సివిల్ అధికారులను ఆదేశించింది.

English summary
Atleast eleven persons were killed and around 26 injured on Wednesday in a road accident in Jammu and Kashmir’s Poonch district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X