Road Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి..
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ నల్లా వద్ద మినీబస్సు డ్రైవర్ అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
"ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. 26 మంది గాయపడ్డారు. ఆర్మీ రెస్క్యూ బృందాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గాయపడిన వారిని పూంచ్ జిల్లాలోని మండి పట్టణంలోని ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు" అని వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూంచ్ లోని సావ్జియాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు అందజేస్తామని తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని పోలీసు, సివిల్ అధికారులను ఆదేశించింది.
Saddened by loss of lives due to a road accident in Sawjian, Poonch. Condolences to bereaved families. May the injured recover soon. Rs. 5 lakh would be given to the next of kin of deceased. Directed Police and Civil authorities to provide best possible treatment to the injured.
— Office of LG J&K (@OfficeOfLGJandK) September 14, 2022