ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం: రాత్రికిరాత్రే 48 మంది పైలట్ల తొలగింపు.. ఎందుకంటే..?
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 48 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది, వీరంతా గతేడాది రాజీనామా చేశారు. అయితే ఆరునెలల నోటీస్ పీరియడ్లో వారు కంపెనీ రూల్స్ ప్రకారం రాజీనామా వెనక్కి తీసుకొని.. తిరిగి విధుల్లో చేరారు. వారు ఎయిర్ బస్ 320 నడిపిస్తున్నారు.

ఎయిర్ ఇండియా ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా పైలట్లను తొలగించాల్సి వచ్చిందని వారికి రాసిన లేఖలో తెలిపింది. కంపెనీ భారీ నికర నష్టాలను చవిచూస్తోన్న నేపథ్యంలో.. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలగించిన పైలట్లు గురువారం రాత్రి తమ సేవలను ముగించారని పేర్కొన్నది.
Recommended Video
పైలట్ల తొలగింపును ఇండియన్ కమర్షియల్ పైలట్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్కు ఒక లేఖ కూడా రాసింది. పైలట్లను ఉద్యోగం నుంచి తొలగింపుపై చైర్మన్ రాజీవ్ బన్సాల్ జోక్యం చేసుకోవాలని కోరింది. రాజీనామా చేసి.. వెనక్కి తీసుకున్న వారిని తొలగించడం సరికాదన్నారు. కరోనా, ఆర్థిక ఇబ్బందులు పేరు చెప్పి ఉద్యోగులను ఎలా తీసివేస్తారని ప్రశ్నించింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications