టార్గెట్ 2019: పార్టీ నేతలతో మోడీ విందు మీటింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపి సీనియర్ నాయకులతో గురువారం రాత్రి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికలతో పాటు ఈ ఏడాదిలో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్ర మంత్రివర్గ సభ్యులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ నేతలకు ఈ సందర్భంగా పీఎం మోడీ విందు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే చివరి ఏడాది ఇదే. అయితే సుమారు మూడు గంటల పాటు పార్టీ నేతలతో మోడీ చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయమై మోడీ ఈ సందర్భంగా పార్టీ నేతలతో చర్చించారు.
ఈ ఏడాది మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారని సమాచారం.
2014 ఎన్నికల్లో బిజెపి విజయంలో యువత, మహిళల ఓటర్లు కీలకంగా వ్యవహరించారు.జనవరి 18, బిజెపి మిలీనియం ఓటు క్యాంపెయిన్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications