Uttar Pradesh Assembly Elections : బీజేపీలో రాజ్ పుత్ చిచ్చు- బ్రహ్మణుల బుజ్జగింపుకు కమిటీ
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో అంతర్గత వివాదాలు తప్పడం లేదు. ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ ఘటన తర్వాత బ్రహ్మణులకూ, రాజ్ పుత్ లకూ మధ్య అంతరం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని బుజ్జగిస్తూ ఎన్నికల తీరం దాటడం ఆ పార్టీకి కష్టంగా మారుతోంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనలో రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేనీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయన్ను వెనకేసుకొస్తున్న బీజేపీ తీరుపై బ్రహ్మణులు మండిపడుతున్నారు. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పుట్టి ముంచుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. అలాగని బ్రహ్మణుల్ని వదులుకుని కేవలం రాజ్ పుత్ లతో ఎన్నికలను ఎదుర్కోలేని పరిస్ధితి. దీంతో బ్రాహ్మణుల బుజ్జగింపుకు సిద్ధమవుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 403 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్ణయించడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని బిజెపి నిర్ణయించింది. కమిటీలో కేంద్ర మాజీ మంత్రులు శివ ప్రతాప్ శుక్లా, మహేశ్ శర్మ, బీజేపీ నేత అభిజత్ మిశ్రా, మాజీ జాతీయ కార్యదర్శి రామ్ భాయ్ మొకారియా సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన యూపీలోని బ్రాహ్మణ సంఘాల నేతల సమావేశంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు యూపీలో ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ఓట్లు 17% ఉన్నాయి. అలాగే వారి స్వంత వాస్తవ సంఖ్యలకు మించి చాలా చోట్ల ప్రభావం చూపే పరిస్ధితుల్లో వారు ఉన్నారు. దీంతో పూర్వాంచల్ లేదా తూర్పు ఉత్తరప్రదేశ్లోని పలువురు బ్రాహ్మణ నాయకులు ఇటీవల సమాజ్వాదీ పార్టీలోకి మారారు, ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీతో గతంలో ఉన్నవారు ఇలా చేరిపోయారు.
దీంతో బీజేపీలో ఆందోళన పెరుగుతోంది. అయితే వివాదాస్పద కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా 'తేని' తన ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతారని వర్గాలు తెలిపాయి. నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆయన కుమారుడి ప్రమేయం కారణంగా మిశ్రా వివాదాస్పదంగా మారారు.