నా డబ్బుతో 25వేల మంది మహిళలకు సురక్షా బీమా ప్రీమియం: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం పర్యటించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అమేథి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తాను అమేథి కుటుంబానికి కూతురినని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల్లో పూర్తి చేయలేని హామీలను తాము పది రోజుల్లో నేరవేర్చామని తెలిపారు.
ఇందుకు నిదర్శనం అమేథి-ఉంచార్ మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లలో చేయలేని పనులను ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసిందన్నారు.

ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన కింద అమేథిలోని 25 వేల మంది అంగన్ వాడీ మహిళా కార్యకర్తలకు మొదటి ఏడాది సురక్షా బీమా ప్రీమియం ప్రభుత్వ సొమ్ముతో కాకుండా తన సొంత అకౌంట్ నుంచే చెల్లిస్తానని ఆమె అన్నారు.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications